‘ఇండియన్‌ 2’ షూటింగ్‌లో ప్రమాదం: ముగ్గురు మృతి.!

మరిన్ని వార్తలు

విశ్వ నటుడు కమల్‌ హాసన్‌ నటిస్తోన్న ‘ఇండియన్‌ 2’ షూటింగ్‌లో ప్రమాదవశాత్తూ జరిగిన దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. షూటింగ్‌లో భాగంగా చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో లైటింగ్‌ కోసం సెట్స్‌ వేస్తున్నారు. ఈ క్రమంలో 150 అడుగు ఎత్తు నుండి ఓ భారీ క్రెయిన్‌ అదుపు తప్పి టెంట్‌ మీద పడిపోవడంతో, ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనా సమయంలో అక్కడికక్కడే ముగ్గురు మృత్యు వాత పడ్డారు. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చెన్నైలోని సవిత ఆసుపత్రికి తరలించారు.

 

చనిపోయిన వారిలో ఒకరు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కాగా, మరో ఇద్దరూ అసిస్టెంట్‌ విభాగంలో పని చేసేవారే కావడం మరింత బాధాకరమైన విషయం. ఈ ప్రమాదం పట్ల కమల్‌హాసన్‌, డైరెక్టర్‌ శంకర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శంకర్‌ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ‘ఇండియన్‌ 2’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. దాదాపు 27 ఏళ్ల తర్వాత ‘ఇండియన్‌’ సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సిద్దార్ద్‌ కీక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్‌లో అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS