'శర్వా' కంటే ముందు 'రణరంగం'.. ఆ హీరో తో చేయాలి: సుధీర్ వర్మ.

మరిన్ని వార్తలు

'సౌండ్ కట్ ట్రైలర్' తో ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది 'రణరంగం' చిత్రం. శర్వానంద్, కళ్యాణి ప్రియదర్శన్ మరియు కాజల్ అగర్వాల్ నటిస్తున్న పీరియాడిక్ క్రైమ్ డ్రామా రణరంగం. స్వామి రారా, దోచేయ్, కేశవా లాంటి చిత్రాలు అందించిన సుధీర్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

విడుదల తేదీ దగ్గరపడుతున్న తరుణం లో చిత్ర దర్శకుడు సుధీర్ వర్మ ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీడియాతో పంచుకున్నాడు. ఇంతకీ ఈ చిత్రం అసలు శర్వానంద్ సినిమా కాదంట.. మొదట మాస్ రాజా 'రవితేజ' తో ఈ చిత్రాన్ని ఓకే చేసుకున్నాడట ఈ యువ దర్శకుడు. కానీ రవితేజ డేట్స్ లేట్ అవ్వడం తో ఈ గ్యాప్ లో కేశవ చిత్రం తెరకెక్కించాడు సుధీర్..అ చిత్రం బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది.

 

తరువాత ఆ చిత్ర నిర్మాత 'బాపి'.. శర్వానంద్ తో 'రాధ' చిత్రం చేస్తున్న సమయంలో ఓ రోజు సుధీర్ ని లంచ్ లో కలిశాడట.. అప్పుడు శర్వా.. సుధీర్ తో మనం ఒక సినిమా చేయాలి అని చెప్పాడట..'రణరంగం' లైన్ విని.. రెండు వేరు వేరు గెటప్స్ లో కనిపించాలని తెలిసి ఎక్సయిట్ అయ్యాడట. దాంతో సుధీర్ రవితేజ ని ఒప్పించి.. శర్వానంద్ తో రణరంగం పూర్తి చేసాడట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS