క‌ల్యాణ్‌రామ్ వ‌స్తున్నాడు... మ‌రి తార‌క్ మాటేంటి?

మరిన్ని వార్తలు

తెలంగాణ ఎన్నిక‌ల ప్రచారం లో టీడీపీ పార్టీ కోసం నంద‌మూరి క‌థానాయ‌కులు రంగంలోకి దిగుతున్నారు. కుక‌ట్‌ప‌ల్లి నియోజ‌క వ‌ర్గం నుంచి నంద‌మూరి హ‌రికృష్ణ కుమార్తె నంద‌మూరి సుహాసిని పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఆమె త‌ర‌పున నంద‌మూరి క‌థానాయ‌కుడు ప్ర‌చారం చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఆల్రెడీ తార‌క‌ర‌త్న మైకు ప‌ట్టుకుని `తెలుగు దేశాన్ని గెలిపించండి` అంటూ ప్ర‌చారం మొద‌లెట్టేశారు.

త్వ‌ర‌లో క‌ల్యాణ్ రామ్ కూడా ప్ర‌చారంలో పాలుపంచుకున్నారు. ఈ వారంలోనే క‌ల్యాణ్ రామ్ ప్ర‌చార కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుడ‌తార‌ని, రెండు రోజుల పాటు కూక‌ట్ ప‌ల్లిలో ప్ర‌చారం చేస్తార‌ని తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ కూడా ఇందులో పాలుపంచుకుంటారా?  లేదంటే క‌ల్యాణ్ రామ్ త‌ర‌వాతే ఎన్టీఆర్ రంగంలోకి దిగుతారా? అనేది ఆస‌క్తిగా మారింది.

అయితే... ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఎన్టీఆర్ పాల్గొనే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌ని, ఆయ‌న దాదాపుగా ఎన్నిక‌ల‌కు, ప్ర‌చారానికి దూరంగా ఉండాలని నిర్ణ‌యించుకున్నార‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు. ఒక‌వేళ‌... అక్క కోసం ప్ర‌చారం చేస్తే.. ఏపీలోనూ టీడీపీ కోసం తిరిగాల్సివ‌స్తుంద‌ని ఆలోచిస్తున్నార్ట‌. మొత్తానికి క‌ల్యాణ్ రామ్ మాత్రం ప్ర‌చారానికి ఓకే అన్నాడు. ఎన్టీఆర్ నిర్ణ‌యం కోసం వేచి చూడాల్సిందే. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS