'మహానటి' ఏం చేస్తోంది?

మరిన్ని వార్తలు

ఈ జనరేషన్‌ 'మహానటి' అని చెరగని ముద్ర వేయించుకున్న ముద్దుగుమ్మ కీర్తిసురేష్‌ ఈ ఏడాది కొంచెం స్లోగా అడుగులేస్తోంది. గత ఏడాది తెలుగు, తమిళ భాషల్లో ఎక్కడ చూసినా కీర్తిసురేష్‌ కనిపించింది. కానీ ఈ ఏడాది మాత్రం కామ్‌గా ఉంది. సినిమాలు చేస్తోంది కానీ, జోరు కొంచెం తగ్గింది. తెలుగుతో పాటు, మదర్‌ టంగ్‌ మలయాళంలోనూ ఓ సినిమాలో నటిస్తోంది. అలాగే ఇటీవల హిందీలోనూ అడుగుపెట్టింది.

 

హిందీ సినిమా కోసం జీరో సైజ్‌ ఫిజిక్‌లోకి వచ్చేసింది. 'మహానటి' కోసం కాస్త బొద్దుగా మారిన కీర్తిసురేష్‌ ఏం చేసిందో ఏమో కానీ, స్లిమ్‌గా మరింత అందంగా మారిపోయింది. ఇటీవల తెలుగులో కీర్తిసురేష్‌ కనిపించిన సినిమా అంటే 'మన్మధుడు 2' ఒక్కటే. అది కూడా క్యామియో రోల్‌ కావడంతో, కీర్తి అంతగా ఎలివేట్‌ కాలేదు. అయితే, త్వరలో 'మిస్‌ ఇండియా' సినిమాతో కీర్తిసురేష్‌ రాబోతోంది. 'మహానటి' తర్వాత ఆ స్థాయిలో తనకు పేరు తెచ్చిపెట్టే సినిమా 'మిస్‌ ఇండియా' అవుతుందని నమ్మకంగా చెబుతోంది కీర్తి సురేష్‌. అవుట్‌ అండ్ పుట్‌ బాగా వస్తోందట. నవీన్‌ చంద్ర, పూజా పొన్నాడ, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి నరేంద్రనాధ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేయలేదు. కానీ, త్వరలోనే మన 'మహానటి', 'మిస్‌ ఇండియా'గా ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS