'మిస్‌ ఇండియా'గా కీర్తి సురేష్‌?

మరిన్ని వార్తలు

'మహానటి' సినిమాతో సౌత్‌ ఆడియన్స్‌తో ఈ జనరేషన్‌ మహానటిగా కీర్తి దక్కించుకున్న ముద్దుగుమ్మ కీర్తిసురేష్‌. ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ వన్‌ ఆఫ్‌ ది స్టార్‌ హీరోయిన్‌గా చెలామణీ అవుతోంది ప్రస్తుతం కీర్తి సురేష్‌. త్వరలో తెలుగులో 'మన్మధుడు 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ మధ్యనే బాలీవుడ్‌లో కూడా అడుగు పెట్టింది.

 

అజయ్‌ దేవగణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో కీర్తిసురేష్‌ నటిస్తోంది. ఇదిలా ఉంటే, కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో తాజాగా ఓ సినిమా రూపొందనుంది. కథానాయిక ప్రాధాన్యత ఉన్న సినిమా ఇది. మహేష్‌ కోనేరు నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాతో నరేంద్ర డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన, ఈ సినిమా టైటిల్‌కి సంబంధించి, ఓ ఆశక్తికరమైన పేరు తాజాగా ప్రచారంలోకి వచ్చింది.

 

కథను బట్టి, ఈ సినిమాకి 'మిస్‌ ఇండియా' అనే టైటిల్‌ అనుకుంటున్నారట. 'మహానటి' తర్వాత ఈ టైటిల్‌కి అంతలా పాపులారిటీ దక్కే అవకాశాలున్నాయి. అయితే, ఈ టైటిల్‌ విషయంలో ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో టైటిల్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఒకవేళ రెస్పాన్స్‌ని బట్టి ఈ టైటిలే కన్‌ఫామ్‌ చేస్తే, కీర్తిసురేష్‌ త్వరలో 'మిస్‌ ఇండియా'గా మారనుందన్న మాటే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS