కన్నడ సినీ ఇండస్ట్రీ ని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా 'కె.జి.ఎఫ్'. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ 'యష్' నటించిన ఈ చిత్రం.. ఒక కన్నడలోనే కాదు అనువాదమైన అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం ఘనవిజయం సాధించడం తో ఈ చిత్రానికి సంబంధించి సీక్వెల్ పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తోడు ఈసారి సీక్వెల్ లో సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి బాలీవుడ్ దిగ్గజాలు కూడా నటించడం తో 'కె.జి.ఎఫ్2' క్రేజ్ పతాక స్థాయికి చేరుకుంది.
కానీ ఇప్పుడున్న కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు పూర్తిగా ఆగిపోయాయి. అయినా, ఫ్యాన్స్ మాత్రం టీజర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తుండడం తో.. నిర్మాత కార్తీక్ తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఒకటి వెల్లడించాడు. ప్రస్తుతానికి ఎటువంటి టీజర్ విడుదల చేయడం లేదు, కానీ అక్టోబర్ 23న సినిమా విడుదలకు ముందు అదిరిపోయే ట్రైలర్ ఒకటి విడుదల చేస్తాం అని చెప్పుకొచ్చారు. ఒక రకంగా ఫ్యాన్స్ కు ఇది చేదు వార్త అనే చెప్పుకోవాలి.
#KGFChapter2 teaser wont be anytime soon. Closer to the release we will have a trailer and a trailer with a bang. So stay home and stay safe now. Lets move ahead.
— Karthik Gowda (@Karthik1423) April 17, 2020