మహేష్‌ మేనియా: షాకయ్యింది కియారా!

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ స్టార్స్‌కి వుండే క్రేజ్‌ గురించి తెలిసినా, సౌత్‌లో హీరోలకుండే సెపరేట్‌ క్రేజ్‌ ఏంటో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది బాలీవుడ్‌ బ్యూటీ కియారా అలియా అద్వానీకి. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా రూపొందిన 'భరత్‌ అనే నేను' సినిమా విడుదలకు సిద్ధమైన సంగతి తెల్సిందే. 

ఈ సినిమాతో తొలిసారిగా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతోంది కియారా. సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో ముద్దు ముద్దుగా మాట్లాడేస్తూ, ఆల్రెడీ కుర్రకారుకి కిర్రాకు పుట్టించేసిన కియారా, తొలి సినిమాతోనే సూపర్‌ హిట్‌ కొట్టేస్తాననే ధీమా వ్యక్తం చేస్తోంది. ఇదిలా వుంటే, తాజాగా కియారా అలియా అద్వానీ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో తన పేరుని 'కియారా అను నేను'గా మార్చేసింది (అప్పీయరెన్స్‌ మాత్రమే). 

తెలుగులో ఇప్పుడిప్పుడే మాట్లాడటం నేర్చుకుంటోందట. ఇంకో రెండు మూడు సినిమాలు చేసేనాటికి తెలుగులో గలగలా మాట్లాడేస్తానని కియారా భరోసా ఇస్తోంది. బాలీవుడ్‌తో పోల్చితే, తెలుగు సినీ పరిశ్రమలో తారల పట్ల అభిమానం ఎక్కువనీ, తనకు తెలుగు సినీ పరిశ్రమ నుంచి వస్తోన్న గౌరవం అపారమనీ కియారా అలియా అద్వానీ అంటోంది. 

కొరటాల శివ, మహేష్‌ లాంటి స్టార్స్‌తో పనిచేయడం చాలా ఆనందంగా వుందని కియారా చెబుతోంది. సినిమా రిలీజ్‌కి ముందు షురూ అయిన మహేష్‌ మేనియా చూసి షాకయ్యిందట ఈ బ్యూటీ. 'భరత్‌ అనే నేను' తర్వాత కియారా, బోయపాటి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తోన్న సినిమాలో హీరోయిన్‌గా నటించనున్న సంగతి తెల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS