'ఎన్టీఆర్ మహానాయకుడు' పై లక్ష్మీ పార్వతి వివాదాస్పద వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు

నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి జీవిత కథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ మహానాయకుడు. ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా చిత్రీకరించటం జరిగింది. మొదటి పార్ట్ 'కథానాయకుడు' ఫలితంతో నిరాశపడకుండా నందమూరి బాలకృష్ణ చాలా నమ్మకంతో రెండో పార్ట్ విడుదల చేసారు. ఈ సినిమాలోని రెండో భాగం 'ఎన్టీఆర్ మహానాయకుడు' ఈ రోజు విడుదలయ్యింది. ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది. 

 

ఈ సందర్భంగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్టీఆర్ జీవితాన్ని ఒకటికి రెండు భాగాలుగా తీసినా.. ఒక్క దాంట్లో కూడా తన ప్రస్తావన తీసుకురాలేదని.. ఆయన జీవితంలో అతి పెద్ద మోసం చంద్రబాబు వెన్నుపోటు అయితే.. అసలు దాని విషయమే చూపించలేదని పేర్కొంది. నిజానికి చంద్రబాబు నాయుడు పాత్రని పాజిటివ్ గా తీర్చిదిద్దారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతయినా బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యే.. పైగా చంద్రబాబుకి వియ్యంకుడు కాబట్టి అసలు నిజాన్ని చూపించే సాహసం బాలకృష్ణ చేయడని ఆరోపించింది. 

 

అంతేకాదు.. గతంలో ఈ ఇద్దరి మధ్య వైస్రాయ్ ఒప్పందాలు కూడా ఉన్నాయి కాబట్టి.. చంద్రబాబు నిజస్వరూపం చూపించే ధైర్యం బాలకృష్ణకు లేదంటూ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసింది. అయినా ఇవ్వన్నీ చూపించరని నాతో పాటు తెలుగు ప్రేక్షకులందరికీ ముందే తెలుసని చెప్పింది. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు.. ఎన్టీఆర్-లక్ష్మీ పార్వతిల అనుబంధాన్ని గురించి తెలుసుకోవాలంటే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ద్వారానే సాధ్యమవుతుందని.. అందుకే నేను ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నానని తెలిపింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS