'వెంకటలక్ష్మి'గా దర్శనమివ్వనున్న 'రత్తాలు'.!

మరిన్ని వార్తలు

అప్పుడెప్పుడో 'కాంచనమాల కేబుల్‌టీవీ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్‌ చెప్పిన ముద్దుగుమ్మ లక్ష్మీరాయ్‌. తొలి సినిమాకే వీర లెవల్లో స్కిన్‌ షో చేసేసింది. కానీ తర్వాత పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయింది. తర్వాత చాలా కాలానికి లారెన్స్‌ 'కాంచన 2' సినిమాతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన ఈ భామ తెలుగులో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సరసన 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'లో తోబా తోబా.. అంటూ ఓ ఐటెం సాంగ్‌లో తళుక్కుమంది. 

 

ఆ తర్వాత మళ్లీ లారెన్స్‌ పుణ్యమా అని మెగాస్టార్‌ చిరంజీవి 150 వసినిమా 'ఖైదీ'లో రత్తాలుగా వయ్యారాలొలికింది. ఆ తర్వాత బాలీవుడ్‌కి చెక్కేయడం, బోలెడంత క్రేజ్‌ దక్కించుకోవడం, బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని మెప్పించలేక మళ్లీ గోడక్కొట్టిన బంతిలా సౌత్‌కి తిరిగి రావడం అంతా క్షణాల్లో జరిగిపోయాయి. అయితే 'ఖైదీ'లో రత్తాలు ఐటెం సాంగ్‌ తర్వాత రాయ్‌ లక్ష్మిని తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేకపోయారు. 

 

ఇదిలా ఉంటే త్వరలో మన రత్తాలు 'వేర్‌ ఈజ్‌ వెంకటలక్ష్మి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. లక్ష్మీరాయ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సినిమా ఇది. కిషోర్‌ దర్శకుడు. మధునందన్‌, పూజిత పొన్నాడ, జబర్దస్త్‌ మహేష్‌ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి తొలి ఆడియో సింగిల్‌ విడుదలైంది. 'అత్తిలిపాపా.. నీకేందంటే ఇష్టం..' అంటూ సాగే ఈ పాటలో లక్ష్మీరాయ్‌ స్టెప్పులు కిర్రాకు పుట్టించేస్తున్నాయి. ఈ సాంగ్‌ చూస్తుంటే, మన రత్తాలు వెంకటలక్ష్మిగా మరోసారి మ్యాజిక్‌ చేసేలానే ఉంది. చూడాలి మరి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS