షూటింగ్ పూర్తి చేసుకున్న లక్ష్మీ రాయ్ 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మి' చిత్రం..!!

మరిన్ని వార్తలు

లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మి'. రామ్ కార్తిక్, పూజిత పొన్నాడ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. హార్రర్ కామెడీ గా తెరకెక్కుతున్నఈ సినిమా షూటింగ్ పూర్తి చేస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శెరవేగంగా జరుగుతున్నాయి.

 

కాగా ఇటీవలే ఈ చిత్రం నుంచి వచ్చిన 'పాపా నీకేదంటే ఇష్టం' పాటకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుంది.. మాస్ హంగులు జోడించి ఈ పాటను చిత్రీకరించారు.. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగ, త్వరలో టీజర్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్మాతలు.. ఈ చిత్రంలో నటిస్తున్న హాస్యనటులు ప్రవీణ్, మధునందన్ ల కామెడీ హైలైట్ గా నిలవనుంది.

 

హరి గౌర ఈ చిత్రానికి సంగీతం అందించగా, వెంకట్ ఆర్.శాఖమూరి సినిమాటోగ్రఫీ ని అందించారు.. ఏబీటి క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై గురునాథ్ రెడ్డి సమర్పిస్తున్న ఈ సినిమాకి ఎం.శ్రీధర్ రెడ్డి , హెచ్.ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.. మార్చి లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

- ప్రెస్ రిలీజ్


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS