'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' పోస్ట్‌పోన్‌ అయ్యిందా.?

మరిన్ని వార్తలు

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమా విషయంలో నెలకొన్న సందిగ్థతలు ఇంకా అలానే ఉన్నాయి. వాస్తవానికి సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. తాజాగా సోషల్‌ మీడియాలో వర్మ చేసిన ట్వీట్‌ సినిమా పోస్ట్‌ పోన్‌ అయ్యిందేమో అనే అనుమానాలకు తావిస్తోంది. కడపలో 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కోసం ఓ భారీ బహిరంగ సభలో ఏర్పాట్లు జరగుతున్నాయి. ఈవెంట్‌ పేరు 'వెన్నుపోటు ఎన్టీఆర్‌ అలియాస్‌ ఎన్టీఆర్‌ నైటు' అని వర్మ ట్వీట్‌ చేశారు.

 

అయితే ఈ భారీ ఈవెంట్‌కి డేట్‌ మాత్రం కన్‌ఫామ్‌ చేయలేదు. త్వరలో డేట్‌ కన్‌ఫామ్‌ చేస్తామని వర్మ తెలపడంతో సినిమా వాయిదా పడిందనే అనుమానాలొస్తున్నాయి. సినిమా రిలీజ్‌కి 5 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇంకా సెన్సార్‌ విషయంలోనూ క్లారిటీ లేదు. కొందరు ఈ నెల 29కి సినిమా పోస్ట్‌పోన్‌ అయ్యిందంటున్నారు. ఇంకొందరు ఏప్రిల్‌ 11న జరగబోయే సార్వత్రిక ఎన్నికల తర్వాత 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' రిలీజ్‌ అవుతుందని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు టీడీపీ శ్రేణుల నుండి ఈ సినిమా విడుదలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

 

చూడాలి మరి ఏం జరుగుతుందో. అగస్త్య మంజుతో కలిసి వర్మ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. రాకేష్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కన్నడ నటి యజ్ఞాశెట్టి ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్ర పోషిస్తుండగా, రంగస్థల నటుడు విజయ్‌ ఎన్టీఆర్‌ పాత్రలోనూ శ్రీ తేజ చంద్రబాబు పాత్రలో నటిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS