సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విషయంలో నెలకొన్న సందిగ్థతలు ఇంకా అలానే ఉన్నాయి. వాస్తవానికి సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. తాజాగా సోషల్ మీడియాలో వర్మ చేసిన ట్వీట్ సినిమా పోస్ట్ పోన్ అయ్యిందేమో అనే అనుమానాలకు తావిస్తోంది. కడపలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఓ భారీ బహిరంగ సభలో ఏర్పాట్లు జరగుతున్నాయి. ఈవెంట్ పేరు 'వెన్నుపోటు ఎన్టీఆర్ అలియాస్ ఎన్టీఆర్ నైటు' అని వర్మ ట్వీట్ చేశారు.
అయితే ఈ భారీ ఈవెంట్కి డేట్ మాత్రం కన్ఫామ్ చేయలేదు. త్వరలో డేట్ కన్ఫామ్ చేస్తామని వర్మ తెలపడంతో సినిమా వాయిదా పడిందనే అనుమానాలొస్తున్నాయి. సినిమా రిలీజ్కి 5 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇంకా సెన్సార్ విషయంలోనూ క్లారిటీ లేదు. కొందరు ఈ నెల 29కి సినిమా పోస్ట్పోన్ అయ్యిందంటున్నారు. ఇంకొందరు ఏప్రిల్ 11న జరగబోయే సార్వత్రిక ఎన్నికల తర్వాత 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రిలీజ్ అవుతుందని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు టీడీపీ శ్రేణుల నుండి ఈ సినిమా విడుదలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
చూడాలి మరి ఏం జరుగుతుందో. అగస్త్య మంజుతో కలిసి వర్మ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. రాకేష్రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కన్నడ నటి యజ్ఞాశెట్టి ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్ర పోషిస్తుండగా, రంగస్థల నటుడు విజయ్ ఎన్టీఆర్ పాత్రలోనూ శ్రీ తేజ చంద్రబాబు పాత్రలో నటిస్తున్నారు.