అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'సైలెన్స్'. బహుభాషా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని తెలుగులో 'నిశ్శబ్ధం' పేరుతో విడుదల చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి, 'సాక్షి' ది మ్యూట్ ఆర్టిస్ట్ అంటూ అనుష్క పాత్రను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్గా మాధవన్ పాత్రను కూడా రివీల్ చేస్తూ ఓ పోస్టర్ వదిలారు. 'ఆంటోనీ ది సెలబ్రిటీ మ్యుజీషియన్' అంటూ మాధవన్ పాత్రను పరిచయం చేశారు. పచ్చిక బయళ్ల మధ్యన పాత కాలం నాటి ఇనుప కుర్చీలో కూర్చొని, సీరియస్గా గిటార్ ప్లే చేస్తున్న మాధవన్ లుక్ ఇది.
అక్కడక్కడా మెరిసిన లైట్ బియర్డ్తో కళ్లకు గాగుల్స్ పెట్టుకుని, బ్లాక్ కలర్ లెదర్ జాకెట్ ధరించి డిఫరెంట్గా కనిపిస్తున్నాడు మాధవన్ ఈ పోస్టర్లో. పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని సైన్స్ ఫిక్షన్ స్టోరీగా చూపించనున్నారు. అంజలి, షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఎక్కువ భాగం అమెరికాలోనే చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాలో ప్రతీ సన్నివేశం ఆధ్యంతం ఆసక్తిగొలిపేలా ఉంటుందని తెలుస్తోంది. 'భాగమతి' తర్వాత స్వీటీ హీరోయిన్గా నటిస్తున్న చిత్రమిది. లేటెస్ట్గా 'సైరా నరసింహారెడ్డి'లో 'ఝాన్సీ లక్ష్మీభాయ్' పాత్రలో కనిపించి మెప్పించిన అనుష్క, త్వరలోనే 'నిశ్శబ్ధం' వీడనుంది.