Madhavan: మాధ‌వ‌న్ సినిమా కోసం ఇల్లే అమ్మేశాడా?

మరిన్ని వార్తలు

మాధ‌వ‌న్‌లో ఓ మంచి ద‌ర్శ‌కుడు ఉన్నాడ‌న్న సంగ‌తి `రాకెట్రీ` తో సినీ జనాల‌కు తెలిసొచ్చింది. మాధ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన `రాకెట్రీ`కి దేశ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు ల‌భించాయి. అయితే.. ఈ సినిమా కోసం మాధ‌వ‌న్ త‌న సొంత ఇంటిని అమ్ముకోవాల్సివ‌చ్చింద‌ని చెన్నై వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి ప్ర‌శంస‌లైతే వ‌చ్చాయి గానీ, డ‌బ్బులు రాలేద‌ని, అందుకే మాధ‌వ‌న్ అప్పుల్లో కూరుకుపోయాడ‌ని, త‌న ఇల్లు అమ్మి అప్పులు తీర్చాల్సివ‌చ్చింద‌ని టాక్‌.

 

అయితే దీనిపై మాధ‌వ‌న్ క్లారిటీ ఇచ్చాడు. త‌ను ఇల్లు అమ్మేశాన‌న‌డంలో ఎలాంటి నిజం లేద‌ని, ఇప్ప‌టికీ ఆ ఇంట్లోనే ఉంటున్నాన‌ని, `రాకెట్రీ`తో ఎవ‌రూ న‌ష్ట‌పోలేద‌ని, ఈ సినిమాతో సంబంధం ఉన్న‌వాళ్లంతా మంచి డ‌బ్బులు చ‌వి చూశార‌ని, వాళ్లు ఈ యేడాది భారీ మొత్తంలో ఆదాయ‌పు ప‌న్ను కూడా చెల్లించ‌బోతున్నార‌ని, ఈ సినిమా మంచి లాభాల్ని ఆర్జించింద‌ని మాధ‌వన్ క్లారిటీ ఇచ్చాడు. ఇస్రో శాస్త్ర‌వేత్త నంబి నారాయ‌ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించిన సంగ‌తి తెలిసిందే.

 

ప్ర‌ముఖ న‌టులు సూర్య‌, షారుక్‌ఖాన్ అతిథి పాత్ర‌ల్లో క‌నిపించారు. ఈ సినిమాకి రూ.25 కోట్లు ఖ‌ర్చ‌య్యాయ‌ని టాక్‌. థియేట‌ర్ల నుంచి సొమ్ము రాలేదు గానీ, ఓటీటీ, శాటిలైట్‌, డిజిట‌ల్ రైట్స్ ద్వారా దాదాపుగా రూ.50 కోట్లు వ‌చ్చాయ‌ని తెలుస్తోంది. సో... మాధ‌వ‌న్‌కి రూ.25 కోట్లు లాభ‌మే అన్న‌మాట‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS