ఆ రోజే మహేష్ బాబు కొత్త సినిమా అప్ డేట్..!

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ కృష్ణ తరువాత, తన వారసత్వాన్ని చాలా బాధ్యతతో నిర్వహిస్తూ.. తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు మహేష్ బాబు. ఒకప్పటి ప్రిన్స్ ఇప్పుడు భారీ స్టార్ డమ్ సంపాదించుకుని సూపర్ స్టార్ గా టాప్ ప్లేస్ లో సెటిల్ అయిపోయాడు. తన ఆఖరి చిత్రం 'సరిలేరు నీకెవ్వరూ' తో బ్లాక్ బస్టర్ కొట్టి ఫాన్స్ కాలర్ ఎగరేసేలా చేసాడు. ఇప్పుడు తన 27వ చిత్రం కోసం ఫాన్స్ తో పాటు, సినీ అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ చిత్రం మొదట వంశీ పైడిపల్లి తో చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ మహేష్ పరుశురాం స్క్రిప్ట్ ఓకే చేసాడని చర్చ జరిగింది.

 

ఇక ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మే 31న రానుందని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి పరుశురాం డైరెక్టర్ అని, మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని, థమన్ మ్యూజిక్ ఇవ్వనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. సో అసలు విషయం మనకు తెలియాలంటే మే 31 వరకు ఆగాలి. తన తండ్రి పుట్టిన రోజునైనా మహేష్ నోరు విప్పుతాడో లేదో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS