బిజినెస్ మేన్ పేరుతో మహేష్ బాబు ఓ సినిమా చేశాడు. నిజానికి మహేష్లోనూ మంచి వ్యాపార వేత్త ఉన్నాడు. తన క్రేజ్ని, ఇమేజ్ని వాడుకుంటూ బ్రాండ్ అంబాసిడర్గా ఎదిగాడు మహేష్. తన చేతిలో ఉన్న ఎండార్స్మెంట్లకు లెక్కేలేదు. సౌత్ ఇండియాలో వాణిజ్య ప్రకటన ద్వారా అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న కథానాయకుడు మహేషే.
తాజాగా మల్టీప్లెక్స్ వ్యాపారంలోనూ అడుగుపెట్టాడు. హైదరాబాద్లో ఇప్పటికే ఓ మల్టీప్లెక్స్ నడుస్తోంది. బెంగళూరులో మరో మల్టీప్లెక్స్కి శ్రీకారం చుట్టారు. త్వరలోనే విశాఖపట్నంలోనూ ఓ థియేటర్ని నిర్మించనున్నారని తెలిసింది. హంబుల్ కో పేరుతో గార్మెంట్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టాడు మహేష్. అది కూడా బాగానే నడుస్తోంది. ఇప్పుడు పెర్ఫ్యూమ్ కంపెనీ స్థాపించాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులన్నీ ఓ కొలిక్కి వచ్చాయని తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాబోతోంది.