మహి - తెలివైన రాజకీయ 'యాత్ర'.!

మరిన్ని వార్తలు

'యాత్ర' విడుదలకు సిద్దమైంది. ఈ నెల 8న అనగా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతానికైతే ఈ సినిమాపై పెద్దగా అంచనాలేమీ లేవు. అయితే ఓవర్సీస్‌లో మాత్రం అడ్వాన్స్‌ బుకింగ్స్‌ అదిరే రేంజ్‌లో ఉన్నాయట. దానికి కారణం కూడా లేకపోలేదు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 'యాత్ర' సినిమాని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్‌ నేతగా వైఎస్సార్‌ పాదయాత్ర చేసినా, ఆ వైఎస్సార్‌ ఇప్పుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి బ్రాండ్‌ అంబాసిడర్‌. 

 

ఇదిలా ఉంటే, దర్శకుడు మహి.వి.రాఘవ చాలా తెలివిగా ఓ ప్రకటన విడుదల చేశాడు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు తావుంది. ఎవరి అభిప్రాయాలు, ఎవరి అభిరుచులు వారివి. వైఎస్సార్‌ అంటే ఇష్టం ఉంది. కానీ ఎన్టీఆర్‌ పట్ల ద్వేషం లేదు. చిరంజీవి పట్ల కూడా అమితమైన అభిమానం ఉంది. ఇది ఓ సినిమా మాత్రమే. అంతకుమించి రాజకీయాలను ఆపాదించవద్దు.. అని ఆ ప్రకటనలో మహి.వి.రాఘవ పేర్కొన్నాడు. 

 

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, ఎన్టీఆర్‌ ఈ ఇద్దరూ తెలుగు జాతి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనమనీ పేర్కొన్నాడు. ఇది నిజంగానే చాలా తెలివైన ప్రకటన. ఎంత కాదన్నా, రాజకీయ నేపథ్యంలో సినిమా తీసినప్పుడు ఖచ్చితంగా ఆ రాజకీయ ప్రభావం ఉండి తీరుతుంది. ఆ విషయం తెలుసు కాబట్టే, తనవంతుగా వివాదాలకు తావివ్వకుండా అందర్నీ కలుపుకుపోయే ప్రయత్నం చేశారు మహి తన ప్రకటన ద్వారా. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS