హోలీ స్పెషల్‌: మనసు దోచేసిన మెగా మేనల్లుడు.!

మరిన్ని వార్తలు

హోలీ సందర్భంగా పలువురు సోషల్‌ మీడియాలో హోలీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొంచెం విభిన్నంగా సాయి ధరమ్‌ తేజ్‌ ఓ వీడియో పోస్ట్‌ చేసి విషెస్‌ చెప్పాడు. చల్లార్చిన పాలను జాగ్రత్తగా దగ్గురుండి తాగిస్తున్న వీడియో అది. 'అందరికీ హోలీ శుభాకాంక్షలు.. హోలీని జాగ్రత్తగా సంతోషంగా, ఆరోగ్యంగా జరుపుకోండి. మీ చుట్టూ ఉన్న వారికి ప్రేమను పంచండి. ఈ రంగుల పండుగ జంతువులకు హానికరంగా పరిణమించవచ్చు. సో సురక్షితంగా ఆడుదాం..' అంటూ ట్వీట్‌ చేశారు. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. 

 

 

సెలబ్రిటీలు చెబితే ప్యాన్స్‌ వినే అవకాశాలున్నాయి. సో సాయిధరమ్‌ తేజ్‌ పోస్ట్‌ చేసిన వీడియోకి నెటిజన్స్‌ నుండి రీ ట్వీట్లు వస్తున్నాయి. జంతువుల పట్ల తేజుకున్న కేరింగ్‌కి నెటిజన్లు హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు. తేజు ప్రస్తుతం 'చిత్రలహరి' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సినిమా కూడా మంచి విజయం సాధించాలని ఆశిద్దాం. కళ్యాణీ ప్రియదర్శిన్‌, నివేదా పేతురాజ్‌ ఈ సినిమాలో తేజుకీ జోడీగా నటిస్తున్నారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS