'ఎన్టీఆర్ కథానాయకుడు' పై షాకింగ్ కామెంట్స్ చేసిన మోహన్ బాబు

మరిన్ని వార్తలు

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఎన్టీఆర్ కథానాయకుడు'. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అభినందనలు అందుకుంటుంది. నందమూరి బాలకృష్ణ తన తండ్రి పాత్రలో లీనమై నటించారు. ఈ సందర్భంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాపై స్పందించారు. 'ఎన్టీఆర్ సినిమాలో కొన్ని సన్నివేశాలు చూస్తుంటే.. అన్నయ్య మళ్ళీ పుట్టాడా అన్నట్టుంది' అన్నారు. ఈ సందర్భంగా వరుస ట్వీట్లతో ఆయన ఎన్టీఆర్ బయోపిక్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

 

ఒకే తల్లి కడుపున జన్మించక పోయినా రామారావు గారు తనకి అన్నయ్యే అని, అలాంటి మహనీయుడి జీవిత కథను తెరకెక్కించడం చాలా గొప్ప విషయం అని, అందులోనూ ఆయన తనయుడైన బాలకృష్ణ.. తండ్రి నటించిన వివిధ పాత్రలను పోషించటం మాములు విషయం కాదని అన్నారు. 'ఎన్టీఆర్ బయోపిక్' సినిమా ఆడియో ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు కొన్ని క్లిప్పింగ్స్ చూస్తే.. అన్నయ్య మళ్ళీ పుట్టాడా అన్నట్టు ఉందని చెప్పారు. బాలకృష్ణ కొన్ని సన్నివేశాల్లో అచ్చు తన తండ్రి లాగే ఉండటం అద్భుతమని కొనియాడారు. 

 

ఒక మంచి దర్శకుడి చేతిలో ఈ సినిమా పడి, తనే నిర్మించి.. తండ్రి పాత్రలో కొడుకు నటించటం అనేది చాలా అమోఘం. ఈ సినిమా ఎంతో పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడిని ప్రార్థిస్తున్నానని.. మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా కామెంట్ చేసారు. ఈ కామెంట్స్ చూస్తుంటే రామారావు గారిపై ఆయనకు ఎంత అభిమానం ఉందో తెలుస్తుంది. ఇటీవలే మోహన్ బాబు 'మహానటి' చిత్రంలో ఎస్.వీ. రంగారావు గారి పాత్రలో అద్భుతంగా నటించారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS