పవన్‌తో సినిమా: వెనక్కి తగ్గేది లేదు.!

మరిన్ని వార్తలు

'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సినిమాలకు దూరంగా ఉన్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. దాదాపు ఆయన సినిమాలకు దూరమైపోయినట్లే అని ఒక వర్గం వారు అంటుంటే, లేదు లేదు సినిమాల నుండి జస్ట్‌ స్మాల్‌ బ్రేక్‌ తీసుకున్నారంతే అని మరికొందరు అంటున్నారు. అయితే ఆయన ఊ.. అనాలే కానీ, ఆయనతో సినిమాలు తీసేందుకు దర్శక, నిర్మాతలు క్యూలో ఉన్నారు.

మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ వారు పవన్‌తో ఎప్పుడెప్పుడు సినిమా చేద్దామా అనే కుతూహలంతో ఉన్న సంగతి తెలిసిందే. గతంలోనే ఎవ్వరూ ఊహించని రెమ్యునరేషన్‌ పవన్‌ కళ్యాణ్‌కి ఆఫర్‌ చేశారు కూడా. అయితే ప్రస్తుత పరిణామాల దృష్ట్యా పవన్‌ కళ్యాణ్‌ సినిమాలకు దూరం కావడంతో వారి కల తీరేది కాదని కొందరు అంటున్నా, మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్వాహకులు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదనీ, పవన్‌తో సినిమా చేసి తీరతామని గట్టిగా నొక్కి వక్కాణిస్తున్నారు. 

ఇకపోతే ఈ మధ్య హిట్స్‌ మీద హిట్స్‌, బ్లాక్‌ బస్టర్స్‌ కొడుతూ నెంబర్‌ వన్‌ నిర్మాణ సంస్థగా ఉన్న మైత్రీ మూవీస్‌ బ్యానర్‌ నుండి త్వరలో చాలా సినిమాలు రానున్నాయి. వెరీ కమింగ్‌ సూన్‌ ఈ సంస్థ నుండి 'సవ్యసాచి' చిత్రం వస్తోంది. ఆ తర్వాత 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ' చిత్రం రానుంది. ఈ సినిమాపై కూడా అంచనాలు బాగున్నాయి. క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని చాలా రిచ్‌గా చిత్రీకరించారు. 

రవితేజ, ఇలియానా జంటగా తెరకెక్కిన ఈ చిత్రానికి శీను వైట్ల దర్శకత్వం వహించాడు. నవంబర్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS