మెగా కాంపౌండ్‌లో ఇలియానా '2.0'?

మరిన్ని వార్తలు

'ఇలియానా 2.0' అని నభా నటేష్‌ని అభివర్ణించారు డేరింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌. అవును మరి, ఆమెలోని న్యూ యాంగిల్‌ని బయటికి తీసి ఫ్యాన్స్‌కి నిజంగానే షాకిచ్చాడు 'ఇస్మార్ట్‌ శంకర్‌'తో పూరీ. వరంగల్‌ 'చాందినీ'గా ఈ సినిమాలో నభా నటేష్‌ నట విశ్వరూపం చూపించేసింది. పర్‌ఫామెన్స్‌తోనే కాదు, గ్లామర్‌తోనూ పిచ్చెక్కించేసింది. ప్రస్తుతం 'డిస్కోరాజా' సినిమాలో రవితేజకు జోడీగా నటిస్తోంది. త్వరలోనే మెగా కాంపౌండ్‌లో అడుగు పెట్టబోతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌, విలక్షణ దర్శకుడు దేవ్‌ కట్టా కాంబినేషన్‌లో ఓ సినిమా తెరక్కెనుందనీ ఇటీవల ఓ టాక్‌ బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. జె. భగవాన్‌, పుల్లయ్య ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారట. ఈ సినిమా కోసం హీరోయిన్‌గా నభా నటేష్‌ పేరు పరిశీలిస్తున్నారనీ విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే, నభా నటేష్‌ పంట పండినట్లే. మెగా కాంపౌండ్‌లో ఒక్కసారి ఎంట్రీ ఇస్తే చాలు ముద్దుగుమ్మలకు ఆ కిక్కే వేరప్పా.

 

అన్నీ కలిసొచ్చి, ఫస్ట్‌ ఛాన్సే హిట్‌ ఛాన్స్‌ అయితే, ఇంకేముంది, వరుసపెట్టి దున్నేసుకోవచ్చు. మరి ఆ లక్కు కిక్కును ఎంజాయ్‌ చేసే అవకాశం నభాకి దక్కుతుందా.? లేదా.? తెలియాలంటే, ఇంకాస్త సమయం వేచి చూడాల్సిందే. మరోవైపు మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ 'ప్రతీ రోజూ పండగే' సినిమాతో బిజీగా ఉన్నాడు. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా పూర్తి కాగానే, దేవకట్టా సినిమాపై అఫీషియల్‌ క్లారిటీ రానుందేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS