వర్మ, కత్తి, శ్రీరెడ్డి.. ఇప్పుడు నాగబాబు.!

మరిన్ని వార్తలు

సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ ట్వీట్‌లేస్తూ వైరల్‌ అయిన వారిలో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ పేరు మొదటి ప్లేస్‌లో ఉంటుంది. అందుకే ఆయన ట్వీట్స్‌కి 'ఆర్జీవీ ట్వీట్లు' అని స్పెషల్‌ బ్రాండ్‌ కూడా పెట్టేశారు నెటిజన్లు. ఇక ఆ తర్వాత ఓ టైంలో ఆ స్థాయి కాకపోయినా, ఇంచుమించు ఆ స్థాయికి చేరుకుంది శ్రీరెడ్డి. శ్రీరెడ్డి అంటే అంతవరకూ ఎవరో కూడా తెలియని ఆమెకి అంత పాపులారిటీ వచ్చిందంటే సోషల్‌ మీడియాలో ఆమె వేసిన బూతు ట్వీట్లే కారణం. 

 

ఇక మరొకరు క్రిటిక్‌ కత్తి మహేష్‌. ఈయన పరిస్థితి కూడా అంతే, పాపులారిటీ పెంచుకోవడం కోసం పవన్‌ కళ్యాణ్‌పై ట్వీట్లేస్తూ, పవన్‌ ఫ్యాన్స్‌ని రెచ్చగొట్టి, సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిపోయాడు. ఇక వీరి సంగతి పక్కన పెడితే, ఇప్పుడు మెగా బ్రదర్‌ నాగబాబు ట్వీట్లు సంచలనమయ్యాయి. రోజుకో ట్వీట్‌ వేస్తూ, నాగబాబు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ సృష్టిస్తున్నారు. నిన్న బ్లడ్‌, బ్రీడ్‌ అంటూ ట్వీటేసిన నాగబాబు ఇప్పుడు 'కవితలు మాకూ వచ్చండోయ్‌..' అంటూ ఓ ఇంట్రెస్టింగ్‌ కవిత పోస్ట్‌ చేశారు. 

 

'కట్టు కథలు కొన్ని కల్పనలు ఇంకొన్ని చుట్టనేల మూట కట్టనేల నిజం కక్కలేని బయోపిక్కులొద్దయా విశ్వదాభిరామ వినరా మామా..' అంటూ నాగబాబు పెట్టిన పోస్ట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ సర్క్యులేట్‌ అవుతోంది. బాలయ్య నటిస్తున్న ఎన్టీఆర్‌ బయోపిక్‌ మీద నాగబాబు ఈ సెటైర్‌ వేశారనీ నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఈ కవిత నాగబాబే రాశారా.? లేక ఎవరో రాసింది పోస్ట్‌ చేసి ఉంటారా.? అనేది తెలీదు కానీ, నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేసేస్తోంది. చివరిలో 'స్టే ట్యూన్‌డ్‌..' అంటూ ఫ్యాన్స్‌ని హోల్డ్‌లో పెట్టారు నాగబాబు.  


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS