పవన్‌ హీరోయిన్‌ సిక్సర్‌ కొట్టబోతోంది.

మరిన్ని వార్తలు

పవన్‌కళ్యాణ్‌ సరసన 'కొమరం పులి' సినిమాలో నటించిన నికీషా పటేల్‌ గుర్తుందా.? తెలుగులో ఆ తర్వాత ఆమె నటించిన సినిమా 'ఓం'. కళ్యాణ్‌రామ్‌ హీరోగా నటించిన 'ఓం'లో నికీషా నెగెటివ్‌ షేడ్స్‌ వున్న పాత్ర చేసింది. పూరి జగన్నాథ్‌ సోదరుడు సాయిరాం శంకర్‌ సరసన 'అరకు రోడ్‌లో' అనే సినిమాలోనూ నికిషీ కన్పించిన విషయం విదితమే. తెలుగులో పెద్దగా సక్సెస్‌లు లేకపోయినా, తమిళనాట మాత్రం ఆమె ఇప్పుడు బిజీ హీరోయిన్‌. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా అరడజను సినిమాలున్నాయి నికీషా చేతిలో.

 

ఈ ఏడాది మొత్తం 6 సినిమాలు విడుదల కాబోతున్నాయట. అందులో ఒకటి అరవ్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'మార్కెట్‌ రాజా ఎంబీబీఎస్‌'. ఇందులో కావ్యా థాపర్‌ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులోనూ ఓ సినిమా చేస్తున్నానని చెబుతోన్న నికీషా పటేల్‌, మధ్యలో కొంత గ్యాప్‌ వచ్చినా.. కెరీర్‌ ఇప్పుడు పూర్తిస్థాయిలో పుంజుకుందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

 

తొలి తెలుగు సినిమాని ఎప్పటికీ మర్చిపోలేనంటోన్న నికీషా, పవన్‌ తిరిగి సినిమాల్లో నటిస్తే.. అందులో మళ్ళీ ఆయన సరసన నటించాలనుకుంటున్నట్లు తెలిపింది. తెలుగులో 'గుంటూరు టాకీస్‌' సీక్వెల్‌ కోసం నికీషా పటేల్‌ని ఎంపిక చేసినా, ఆ సినిమా స్టేటస్‌ ఏంటన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. తెలుగులో కెరీర్‌ ఎలా వుంటేనేం, తమిళంలో అరడజను సినిమాలంటే చిన్న విషయం కాదు. అందులో ఒకటి రెండు హిట్టయినా, నికీషా ఫేట్‌ మారిపోతుందంతే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS