ఎన్టీఆర్‌ రూటు మార్చాడు గురూ.!

మరిన్ని వార్తలు

ఇటీవల కాలంలో ఎన్టీఆర్‌లో చాలా మార్పు వచ్చింది. ఇతర హీరోలతో చాలా క్లోజ్‌గా ఉంటున్నాడు. గతంలో ఎన్టీఆర్‌ తన దారి తాను చూసుకునేవాడు. తన పని తాను కామ్‌గా చేసుకుంటూ పోయేవాడు. 

తన సినిమాలు తప్ప ఇతర సినిమా విశేషాలు గానీ, ఇతర హీరోల గురించి కానీ పట్టించుకునే వాడు. నందమూరి ఫ్యామిలీలోనే ఎన్టీఆర్‌ని దూరం పెట్టిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ ఫ్యాన్స్‌ ఎన్టీఆర్‌ని పక్కన పడేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా మారింది. ఇందుకు కారణం ఏంటంటే, ఇటీవల ఓ సందర్భంలో తాను తండ్రయ్యాక తన ఆలోచనల్లో చాలా మెచ్యూరిటీ వచ్చిందని తారక్‌ చెప్పాడు. 

అది నిజమే. అందులో భాగంగానే ఇతర హీరోలతో కలిసి మెలిసి మెలగుతున్నాడు. చరణ్‌తో సినిమాకి కమిట్‌ అయ్యి మెగా అభిమానులకు దగ్గరయ్యాడు. మహేష్‌బాబు 'భరత్‌ అనే నేను' సినిమా ఆడియో ఫంక్షన్‌కి అటెండై ఘట్టమనేని అభిమానులను తన వైపుకు తిప్పుకున్నాడు. హీరోలు ఎప్పుడూ ఇలాగే కలిసుండాలి. అప్పుడే బాలీవుడ్‌ మాదిరిగా టాలీవుడ్‌లో కూడా మల్టీ స్టారర్స్‌ వచ్చేందుకు వీలుంటుంది. తద్వారా బాక్సాఫీస్‌ కళకళలాడుతుంటుంది. ముఖ్యంగా అభిమానుల మధ్య గొడవలు కూడా తగ్గుతాయి. 

మొత్తానికి ఎన్టీఆర్‌ భలే చేస్తున్నాడులే. ప్రస్తుతం ఎన్టీఆర్‌ త్రివిక్రమ్‌ సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే స్టార్ట్‌ కాబోయే ఈ సినిమా కోసం జిమ్‌లో తెగ కష్టపడుతున్నాడు ఎన్టీఆర్‌. ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో ముద్దుగుమ్మ పూజా హెగ్దే జోడీ కడుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS