ఎన్టీఆర్ బయోపిక్ విడుదల సందిగ్థంలో పడింది. జనవరి 9న `కథానాయకుడు`, ఫిబ్రవరి 7న `మహా నాయకుడు` విడుదల చేస్తామని ముందే చెప్పారు. `కథానాయకుడు`ని అనుకున్న సమయానికే విడుదల చేసినా `మహానాయకుడు` విషయంలో మాత్రం జాప్యం జరుగుతోంది. ఫిబ్రవరి 7న ఈ సినిమా రావడం లేదని, 15కి వాయిదా పడిందని తేలింది.
ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ కూడా మారబోతోందట. ఫిబ్రవరి 21న రావొచ్చని అనుకుంటున్నారు. ఫిల్మ్నగర్లో విడుదల తేదీ విషయంలో ఇంత కన్ఫ్యూజన్ నడుస్తున్నా... చిత్ర బృందం స్పందించడం లేదు. దాంతో ఈ గందరగోళం మరింత ఎక్కువవుతోంది. ఎన్టీఆర్ - కథానాయకుడు ఫ్లాప్ అవ్వడంతో చిత్రబృందం డీలా పడింది. అందుకే విడుదల తేదీ ప్రకటించే విషయంలో అంత ఉత్సాహం చూపించడం లేదు.
బయ్యర్లకు నష్టపరిహారం చెల్లించడానికి బాలయ్య ముందుకొచ్చాడని, ఆ లెక్కలు ఇంకా తేలడం లేదని, అందుకే విడుదల తేదీ విషయంలో స్పష్టతకు రాలేకపోతున్నాడని తెలుస్తోంది. దాంతో పాటు పార్ట్ 2లో మరో రెండు పాటల్ని తెరకెక్కించాల్సివుంది. అదెప్పుడు పూర్తవుతుందో క్రిష్కే తెలియాలి. ఈనెలాఖరుకి షూటింగ్ పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు. షూటింగ్ పూర్తయితే విడుదల తేదీ విషయంలో ఓ క్లారిటీ రావొచ్చు.