బెల్లంకొండ హీరోయిన్ల అండ

మరిన్ని వార్తలు

బెల్లంకొండ సురేష్‌ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అవుతోంది. భారీ బడ్జెట్‌తో శ్రీనివాస్‌ సినిమాలు తెరకెక్కుతూ ఉంటాయి. తొలి సినిమా 'అల్లుడు శీను' కోసం చేసిన ఖర్చు అంతా ఇంతా కాదు. భారీ నుండి అతి భారీ సెట్టింగులు ఈ సినిమాలో దర్శనమిచ్చాయి. చాలా రిచ్‌ లొకేషన్స్‌లో సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాకి మెయిన్‌ పబ్లిసిటీ ఎలిమెంట్‌గా హీరోయిన్‌ సమంత నిలిచింది. సమంతని పెట్టి స్పెషల్‌గా పోస్టర్స్‌ డిజైన్‌ చేసి పబ్లిసిటీ చేశారు. అలాగే ఐటెం సాంగ్‌ కోసం మిల్కీ బ్యూటీ తమన్నాని తీసుకొచ్చారు. ఆ రకంగా ఆ సినిమా ఇండస్ట్రీలో టాక్‌ ఆఫ్‌ ది రికార్డ్‌గా నిలిచింది. రెండో సినిమా 'స్పీడున్నోడు'లో హీరోయిన్‌ అంతగా ఎలివేట్‌ కాకపోవడంతో ఆ సినిమా మరుగున పడింది. మూడో సినిమా విషయానికి వచ్చేసరికి రకుల్‌ ప్రీత్‌సింగ్‌తో మళ్లీ మొదటి సినిమా ప్లానింగ్‌నే అమలు చేస్తున్నారు చిత్ర యూనిట్‌. రకుల్‌తో పబ్లిసిటీ షురూ చేస్తున్నారు. ఈ సినిమాకి 'జయ జానకీ నాయకా' అనే టైటిల్‌ని పెట్టి విశేషంగా ఆడియన్స్‌ని ఎట్రాక్ట్‌ చేస్తున్నారు. బెల్లంకొండ విషయానికి వస్తే హీరోకి ఉండాల్సిన కటౌట్‌ ఉంది. డాన్సులు, ఫైట్లు ఇరగదీస్తాడు. ఇవన్నీ ఇలా ఉండగా, తాజాగా నాలుగో సినిమా కూడా లైన్‌లో పెట్టేశాడు బెల్లంకొండ. శ్రీవాస్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. పూజా హెగ్దేతో ఈ సినిమాకి హైప్‌ పెరిగింది. అభిషేక్‌ నామా నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్దే కేవలం గ్లామరే కాదు, చాలా ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తోందట. అదీ సంగతి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS