శ్రీదేవి పాటకు జిగేల్‌ రాణి స్టెప్పులేస్తే.!

మరిన్ని వార్తలు

'ఆకు చాటు పిందె తడితే..' అంటూ శ్రీదేవి పాత్రలో నటించి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఆకట్టుకుంది 'ఎన్టీఆర్‌ - కథానాయకుడు'లో. ఇప్పుడు శ్రీదేవి పాటకు ఇంకో ముద్దుగుమ్మ స్టెప్పులేయనుంది. ఆమె ఎవరో కాదు, జిగేల్‌ రాణి పూజాహెగ్దే. ప్రస్తుతం పూజా హెగ్దే 'వాల్మీకి' సినిమాలో వరుణ్‌ తేజ్‌కి జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అలనాటి బ్లాక్‌ బస్టర్‌ మూవీ 'దేవత' సినిమా నుండి సూపర్‌ హిట్‌ సాంగ్‌ 'వెల్లువెత్తి గోదారమ్మ వెల్లకిల్లా పడ్డాదమ్మా..' అనే సాంగ్‌ని రీమిక్స్‌ చేస్తున్నారని సమాచారం.

 

ఆ పాటకు ఎవర్‌ గ్రీన్‌ అందగాడు శోభన్‌బాబు, అతిలోక సుందరి శ్రీదేవి అదిరిపోయే స్టెప్పులేశారు అప్పట్లో. గోదారి ఒడ్డున బిందెల సెట్టింగ్‌తో ఆ పాట వినసొంపుగానే కాదు, చూసేందుకూ చూడ చక్కగా ఉంటుంది. శ్రీదేవి, శోభన్‌ బాబు జంట ఆకట్టుకుంటుంది. ఇప్పుడీ పాటను కథానుగుణంగా హరీష్‌ శంకర్‌ తన సినిమాలో రీమిక్స్‌ చేయబోతున్నాడట. వరుణ్‌ తేజ్‌, పూజా హెగ్దే ఈ పాటకు చిందేయనున్నారట.

 

అదే గోదావరి పరిసర ప్రాంతాల్లో ఈ పాట చిత్రీకరణకు ప్లాన్‌ చేస్తున్నారనీ తెలుస్తోంది. గోదారమ్మ ఒడిలో కలర్‌ ఫుల్‌ సెట్‌ని ఈ పాట కోసం సిద్ధం చేస్తున్నారట. త్వరలోనే చిత్రీకరణ మొదలుపెట్టనున్నారనీ తెలుస్తోంది. ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపస్తున్న సంగతి తెలిసిందే. అధర్వ మురళి, మృణాలిని మరో జంటగా కనిపించనున్నారు. సెప్టెంబర్‌ 20న 'వాల్మీకి' ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS