ప్రభాస్ ముందు దర్శకుల క్యూ చాంతాడంత ఉంది. అయితే ప్రభాస్ మాత్రం ఒక్కరికీ ఓకే చెప్పలేదు. `జాన్` తరవాత ప్రభాస్ సినిమా ఏమిటన్నది ఇప్పటికీ క్లారిటీ లేదు. కాకపోతే... శంకర్ కథకు మాత్రం ప్రభాస్ ఫ్లాట్ అయిపోయినట్టు టాలీవుడ్ టాక్. అవును... ప్రభాస్ - శంకర్ల కాంబో దాదాపుగా ఓకే అయిపోయింది. ప్రస్తుతం `భారతీయుడు 2` సినిమాతో బిజీగా ఉన్నాడు శంకర్. ఆ తరవాత... కచ్చితంగా ప్రభాస్తో ఓ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించనుంది. ఇది కూడా పాన్ ఇండియా సినిమాగా రూపొందనుంది.
శంకర్ చిత్రాలన్నీ అత్యంత భారీగా ఉంటాయి. ఓ సోషల్ మెసేజ్ చుట్టూ కథ నడుపుతారు. ఈసారి కూడా అలాంటి కథలోనే ప్రభాస్ కనిపించనున్నాడని టాక్. శంకర్తో సినిమా చేయాలని చిరంజీవి నుంచి మహేష్ బాబు వరకూ అందరూ అనుకున్నారు. కానీ వారి వల్ల కానిది ప్రభాస్కి సాధ్యమైంది.