మారుతి దర్శకత్వం వహించిన చిత్రం ప్రతిరోజూ పండగే. సాయిధరమ్ తేజ్ - రాశీఖన్నా జంటగా నటించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. రూలర్ డల్గా ఉండడం ఈ సినిమాకి మరింత కలిసొచ్చింది.
తొలి మూడు రోజుల్లోనూ ప్రపంచ వ్యాప్తంగా 10.61 కోట్ల షేర్ దక్కించుకుంది. నైజాంలో అత్యధికంగా 3.8 కోట్లు వచ్చాయి. సీడెడ్ లో 1.10 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.33 కోట్లు, ఓవర్సీస్లో 90 లక్షలు తెచ్చుకుంది. క్రిస్మస్ సెలవులు ఈ చిత్రానికి మరింత కలిసొచ్చే అవకాశం ఉంది. సోమ, మంగళవారాలు కూడా ఈ సినిమా నిలబడితే, క్రిస్మస్ రోజున మరింత ఎక్కువ వసూళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది. దాంతో బ్రేక్ ఈవెన్కి దగ్గర పడుతుంది.