'వేలు విడవని బంధం': తేజు పండగ రేపే!

మరిన్ని వార్తలు

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ తాజా చిత్రం 'ప్రతిరోజూ పండగే'. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. శరవేగంగా సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈలోగా సినిమా నుండి ఓ ప్రీ లుక్‌ వదిలారు. రేపు రాత్రి 8 గంటలకు ఫస్ట్‌లుక్‌ వదలనున్నారు. ప్రీ లుక్‌లో రెండు చేతులు ఒకరిని ఒకరు ఒడిసిపట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఓ పెద్ద వయసు వ్యక్తి చేతుల్ని, తేజు ఆప్యాయంగా బలంగా పట్టుకుని ఆపన్న హస్తం ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది.

 

ఆ పెద్ద వ్యక్తి సత్యరాజ్‌ అనుకోవాలి. ఆయన ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ పోస్టర్‌పై 'వేలు విడవని బంధం' అనే క్యాప్షన్‌ ఆసక్తి రేపుతోంది. బ్యాక్‌ గ్రౌండ్‌లో పల్లెటూరి వాతావరణం సుస్పష్టంగా కనిపిస్తోంది. జి.ఎ.పిక్చర్స్‌, యువీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో బన్నీ వాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అల్లు అరవింద్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రాశీఖన్నీ, సాయి ధరమ్‌తేజ్‌తో జోడీ కడుతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'సుప్రీమ్‌' తేజు కెరీర్‌లో పెద్ద హిట్‌గా నిలిచింది.

 

అదే సెంటిమెంట్‌ వర్కవుట్‌ అయితే, ఈ సినిమా కూడా మంచి హిట్‌ కొట్టాలి. ఇటీవలే 'చిత్రలహరి'తో లాంగ్‌ గ్యాప్‌ తర్వాత హిట్‌ కొట్టాడు తేజు. ఈ సినిమాతో ఆ సక్సెస్‌ని కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలిక. డిశంబర్‌లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS