కమెడియన్స్‌ హీరో అవతారం: ప్రవీణ్‌ సంచలన వ్యాఖ్యలు.!

మరిన్ని వార్తలు

కమెడియన్‌గా తనదైన శైలిలో ఆకట్టుకుంటున్న నటుడు ప్రవీణ్‌. 'కొత్త బంగారు లోకం' సినిమాతో కమెడియన్‌గా తెరంగేట్రం చేసిన ప్రవీణ్‌ విభిన్న రకాల పాత్రల్లో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో 'వేర్‌ ఈజ్‌ ది వెంకటలక్ష్మి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ప్రవీణ్‌ కన్నా వెనక వచ్చిన పలువురు కమెడియన్లు హీరోలుగా సత్తా చాటుతున్నారు. 

 

ఈ విషయంలో ప్రవీణ్‌ అభిప్రాయమేంటనీ అడిగితే, కమెడియన్‌ హీరోగా మారడం అనేది నేల విడిచి సాము చేయడమే అన్నాడు. ఈ మధ్య కమెడియన్‌గా కొంత పాపులారిటీ దక్కితే చాలు, నెక్స్ట్‌ లెవల్‌ ఆలోచనలు చేస్తున్నారు కొందరు కమెడియన్లు. అలా ఇప్పటికే ప్రముఖ కమెడియన్లు హీరో అవతారమెత్తేశారు. 

 

కానీ కమెడియన్‌గా వచ్చిన అవకాశాలు, గుర్తింపుతో పోల్చితే ఈ కొత్త అవతారంలో వారికి వచ్చిన గుర్తింపు తక్కువే అని చెప్పాలి. 'హీరో అనేది నా దృష్టిలో చాలా ప్రధానమైన పాత్ర. అందుకోసం చాలామంది సీనియర్‌ హీరోలున్నారు. నేను మాత్రం కమెడియన్‌గా మరిన్ని మంచి పాత్రల్లో కనిపించి ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తాను.. తప్ప హీరో అవ్వాలని ఎక్కువ ఆశపడను..' అంటున్నాడు ప్రవీణ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS