హీరోయిన్స్‌ని లైన్‌లో పెడుతున్న యంగ్‌ హీరో!

మరిన్ని వార్తలు

కన్ను గీటి, కుర్రకారు మనసులు కొల్లగొట్టి, సింగిల్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయిన ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్‌ వారియర్‌. అయితే, ఆమె నటించిన తొలి సినిమా 'ఒరు అదర్‌ లవ్‌' (తెలుగులో 'లవర్స్‌') భారీ అంచనాల నడుమ విడుదలై, దారుణంగా పరాజయం పాలైంది. దాంతో అప్పటి వరకూ సంపాదించుకున్న క్రేజ్‌ అంతా ఒక్కసారిగా కోల్పోయింది ప్రియా ప్రకాష్‌ వారియర్‌. ఆ టైంలోనే కొంత వరకూ తన క్రేజ్‌ని క్యాష్‌ చేసుకుంది కానీ, సరిగ్గా వాడుకోలేదనే టాక్‌ ఉంది. దాంతో రేస్‌లో వెనకబడిపోయిన ప్రియా ప్రకాష్‌ వారియర్‌కి ఇప్పుడు ఆఫర్లు వస్తున్నాయట. ప్రస్తుతం 'శ్రీదేవిబంగ్లా' అనే బాలీవుడ్‌ మూవీలో నటిస్తోంది ప్రియా ప్రకాష్‌ వారియర్‌. దాంతో పాటు, బాలీవుడ్‌లో మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయట.

 

ఈ లోగా టాలీవుడ్‌ నుండి ఓ క్రేజీ ఆఫర్‌ వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. యంగ్‌ హీరో నితిన్‌ సరసన ప్రియా ప్రకాష్‌ వారియర్‌ చోటు దక్కించుకోబోతోందనేది ఈ ప్రచారాల సారాంశం. ఇదిలా ఉంటే, నితిన్‌ చేతిలో మూడు ప్రాజెక్టులు పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'భీష్మ' చిత్రంలో రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇంకో సినిమా కోసం కీర్తి సురేష్‌ పేరు పరిశీలనలో ఉంది. మరో సినిమాకి విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసమే ప్రియా ప్రకాష్‌ వారియర్‌ని తీసుకురానున్నారనీ తెలుస్తోంది. ఈ వార్తలో నిజమెంతో తెలీదు కానీ, ఈ గాసిప్‌తో ప్రియా పేరు మళ్లీ వార్తల్లోకెక్కింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS