తీవ్ర విషాదంలో మునిగిపోయిన ప్రముఖ నిర్మాత కుటుంబం

మరిన్ని వార్తలు

తెలుగు చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని నిర్మాత అయిన ఎన్. గోపాల్ రెడ్డి తనయుడు భార్గవ్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.

ఆ వివరాల్లోకి వెళితే, నెల్లూరు జిల్లాలోని వాకాడ మండలం కంబలి వద్ద సముద్రం తీరంలోకి భార్గవ రెడ్డి మృతదేహం కొట్టుకువచ్చినట్టుగా చెబుతున్నారు. అసలు ఆయన సముద్రంలోకి ఎందుకు వెళ్ళాడు? ప్రమాదవశాత్తు మరణించాడా? లేక ఇంకేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నట్టుగా సమాచారం.

ఈ వార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు హుటాహుటిన నెల్లూరు కి పయనమైనట్టు తెలుస్తున్నది. ఇక గోపాల్ రెడ్డి గారు తెలుగులో ప్రముఖ హీరోలందరితో హిట్ సినిమాలు తీశారు. ఈయన మరణించాక భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్ పైన సినిమాలు మళ్ళీ వారి కుటుంబం నుండి ఎవరు తీయలేదు.

ఈ విషాద సంఘటన నేపధ్యంలో మా www.iQlikmovies.com తరపున గోపాల్ రెడ్డి గారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలుపుతున్నాము.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS