పూరీ ప్రమోషన్‌ అదరగొట్టేశాడుగా.!

మరిన్ని వార్తలు

క్రియేటివ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌ తాజా చిత్రం 'మెహబూబా'. ఈ సినిమాలో ఆయన కొడుకు ఆకాష్‌ పూరీ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నేహాశెట్టి అనే కొత్త భామ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ఈ సినిమా మే 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ఈ సినిమాకి సరికొత్త రీతిలో ప్రమోషన్‌ ప్లాన్‌ చేశారు. ట్రాఫిక్‌ అవేర్‌నెస్‌ కల్గిస్తున్నట్లుగా ఓ చిన్న యాడ్‌ రూపొందించారు. అందులో హీరో, హీరోయిన్స్‌ అయిన ఆకాష్‌, నేహా ఇద్దరూ కనిపిస్తారు.

నేహా, ఆకాష్‌ని కలవడానికి బైక్‌పై వస్తుంది. ఆకాష్‌ని కలిసిన తర్వాత ఇంటికి బయల్దేరుతుంది. అయితే ఇంటికి వెళ్లేటప్పుడు నేహా హెల్మెట్‌ తీసి బైక్‌కి తగిలిస్తుంది. అప్పుడు ఆకాష్‌ పూరీ హెల్మెట్‌ పెట్టుకో నేహా.. 'మై మెహబూబా ఈజ్‌ మై లైఫ్‌' అంటాడు. మన కోసం కాకపోయినా, మనల్ని ప్రేమించే వారికోసమైనా హెల్మెట్‌ ధరించాలి అనే మెసేజ్‌ని ఈ ఇద్దరూ ఈ వీడియో ద్వారా పాస్‌ చేశారన్న మాట. భలేగుందిగా పూరీ అండ్‌ కో ఐడియా. దటీజ్‌ ది క్రియేటివిటీ ఆఫ్‌ పూరీ. సినిమాకి పబ్లిసిటీతో పాటు, సొసైటీకి మంచి మెసేజ్‌ కూడా ఇస్తోందీ వీడియో.

ఇకపోతే సినిమా విషయానికి వస్తే, 1971 నాటి ఇండియా, పాకిస్థాన్‌ బోర్డర్‌లో జరిగే లవ్‌స్టోరీనే ఈ మెహబూబా. ఓ ఇండియన్‌ సైనికుడు, పాకిస్థాన్‌ అమ్మాయి ప్రేమని ఎలా దక్కించుకున్నాడనే కధాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఇండియా, పాకిస్థాన్‌ మధ్య యుద్ధ సన్నివేశాలు, హీరో, హీరోయిన్‌ మధ్య రొమాంటిక్‌ సీన్స్‌ ఈ సినిమాకి స్పెషల్‌ హైలెట్స్‌ కానున్నాయి. ఇక పూరీ టేకింగ్‌ ఎలా ఉందో చూడాలంటే, మే 11 వరకూ ఆగాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS