ఆ నాలుగు పాట‌లూ ఫినిష్ చేస్తే స‌రి!

మరిన్ని వార్తలు

లాన్ డౌన్ నుంచి షూటింగుల‌కు మిన‌హాయింపు ల‌భించింది. మెల్ల‌మెల్ల‌గా షూటింగులూ ప్రారంభం అవుతున్నాయి. అయితే స్టార్లు బ‌య‌ట‌కు రావ‌డానికి కాస్త సమ‌యం ప‌ట్టేట్టు ఉంది. అంద‌రి కంటే ముందుగా అల్లు అర్జున్ సెట్స్‌లోకి వ‌చ్చే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. `పుష్ఫ‌` షూటింగ్ అతి త్వ‌ర‌లో ప్రారంభం అవ్వ‌బోతున్న‌ట్టు టాలీవుడ్ టాక్‌.

 

సెట్లో 40 మంది స‌భ్యులు మించకుండా షూటింగులు చేసుకోవ‌చ్చ‌ని ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. మామూలుగా అయితే సెట్లో 150 నుంచి 200 మంది స‌భ్యులుంటారు. ఇప్పుడు మూడో వంతుతో మాత్ర‌మే స‌ర్దుకుపోవాల‌న్న‌మాట‌. అలా జ‌ర‌గాలంటే.. గ్రూపు డాన్స‌ర్లు అవ‌స‌రం లేని పాట‌లూ, మాంటేష్ షాట్లూ తీసుకోవాలి. `పుష్ష‌` టీమ్ పాట‌ల‌కే ప్రాధాన్యం ఇవ్వ‌నుంది. ఇప్ప‌టికే దేవి శ్రీ ప్ర‌సాద్ నాలుగు పాట‌ల్ని కంపోజ్ చేసి పెట్టాడ‌ట‌. అందుకే ముందు పాట‌ల ప‌ని ఫినిష్ చేయాల‌ని బ‌న్నీ, సుకుమార్ భావిస్తున్నారు. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ సెట్ వేస్తున్నారు. అందులో బ‌న్నీ, ర‌ష్మిక‌ల‌పై పాట‌తో పుష్ష షూటింగ్ ప్రారంభించాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంద‌ట‌. జులై మొద‌టి వారంలోనే షూటింగ్ సాధ్యం అవుతుంద‌ని స‌మాచారం. ఆగ‌స్టులోగా పాట‌ల‌న్నీ పూర్త‌యితే, ఆ త‌ర‌వాత‌.. టాకీ మొద‌లెట్టొచ్చని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS