మల్టీ స్టారర్‌కి రెడీ అవుతోన్న యాంగ్రీ స్టార్‌.!

మరిన్ని వార్తలు

‘గరుడవేగ’, ‘కల్కి’ చిత్రాలతో యాంగ్రీ స్టార్‌ రాజశేఖర్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత ఈ సినిమాలతో సక్సెస్‌ టేస్ట్‌ కూడా బాగానే చవి చూశారు రాజశేఖర్‌. ఇక ఇప్పుడు తదరుపరి చిత్రం కోసం కసరత్తులు చేస్తున్నారు. యంగ్‌ డైరెక్టర్స్‌ తెస్తున్న కథలు వింటున్నారట. అయితే, ఆయా కథల విషయంలో రాజశేఖర్‌ కొంత సందిగ్ధంలో ఉన్నారనీ తెలుస్తోంది. ఇకపోతే, ప్రముఖ దర్శకుడు వీరభద్రమ్ చౌదరి అప్పుడెప్పుడో ఓ స్టోరీ లైన్‌ వినిపించాడట. ఆ కథపై రాజశేఖర్‌ కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలిసింది.

 

అయితే, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ స్టోరీని మల్టీస్టారర్‌గా కన్‌వర్ట్‌ చేయమని వీరభద్రమ్ కి రాజశేఖర్‌ సూచించినట్లు తెలుస్తోంది. మల్టీ స్టారర్‌ ట్రెండ్‌ సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న ఈ తరుణంలో రాజశేఖర్‌ ప్రయత్నం కూడా ఫలిస్తుందనే నమ్మకాలు లేకపోలేవు. సో రాజశేఖర్‌తో మల్టీ స్టారర్‌కి ఢీ అనే ఆ హీరో ఎవరనే అంశంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సీనియర్‌ స్టార్స్‌ సినిమాలకు రాజశేఖర్‌ విలన్‌గా మారబోతున్నారన్న టాక్‌ ఆ మధ్య ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. కానీ, ఇప్పుడా ప్రచారానికి బలం చేకూరడం లేదు కానీ, యంగ్‌ హీరోలతో మల్టీ స్టారర్స్‌కి రాజశేఖర్‌ సై అంటున్నాడట. ఆ క్రమంలో రామ్, కార్తికేయ, శ్రీ విష్ణు, రాజ్‌తరుణ్‌ తదితర హీరోలున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి, ఈ యాంగ్రీ స్టార్‌తో మల్టీ స్టారర్‌కి ఏ హీరో సై అంటాడో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS