వివాదాల్లో రజినీకాంత్ 'పేట'

మరిన్ని వార్తలు

తమిళనాడులో గురువారం రోజు రెండు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో ఒకటి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన 'పేట' కాగా, మరొకటి థల అజిత్‌ కుమార్‌ నటించిన 'విశ్వాసం' మూవీ. అయితే ఈ రెండు భారీ చిత్రాలూ ఒకేసారి విడుదలవడంతో ఇరు హీరోల ఫ్యాన్స్‌ వాదనకు దిగారట. మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప అంటూ దెబ్బలాటకు దిగి, ఆది కాస్తా కొట్లాటగా మారింది. 

 

చిన్నగా మొదలైన ఈ గొడవలు చిలికి చిలికి గాలివానలా పెరిగి, ఏకంగా దాడుల దాకా చేరాయట. దాంతో కొంతమందికి గాయాలు, మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయనీ కోలీవుడ్‌ తాజా సమాచారమ్‌. అగ్రహీరోల సినిమాలు ఒకేరోజు విడుదలైతే ఇలాంటి గొడవలు కామనే అయినా, తమిళనాడులో ఆ గొడవలు కాస్త తీవ్రరూపం దాల్చాయి. 

 

ఇకపోతే గురువారం రోజు తెలుగులో కూడా పేట సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు ముందు మా సినిమాకు ధియేటర్లు లేవు అంటూ 'పేట' తెలుగు డబ్బింగ్‌ ప్రొడ్యూసర్‌ నానా గొడవ చేశారు. తీరా సినిమా విడుదలయ్యాక అస్సలు పేటా హవానే కనిపించలేదెక్కడా. 'రోబో 2.0' సినిమా తర్వాత రజనీ నుండి వచ్చిన సినిమా ఇది. కార్తిక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష, సిమ్రాన్‌ హీరోయిన్లుగా నటించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS