హోటల్ కి వెళ్లి మోసపోయిన రకుల్ ప్రీత్ సింగ్

మరిన్ని వార్తలు

ఒకప్పుడు తెలుగు పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగొందిన రకుల్ ప్రీత్ కి ఇప్పుడు అవకాశాలు రావటమే గగనంగా మారింది. మళ్ళీ తెలుగులో తన సత్తా చాటేందుకు రకుల్ పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కాదు. తాజా చిత్రం 'దేవ్' హిట్ అయితే టాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకోవచ్చు అని ఆశించింది. కానీ, ఈ సినిమా కూడా ఘోరంగా విఫలం కావడంతో రకుల్ కెరీర్ సందిగ్ధంలో పడింది. ప్రస్తుతం ఈ భామకి తమిళంలో మంచి అవకాశాలే ఉన్నా తెలుగు పరిశ్రమపైనే ఎక్కువ దృష్టి పెడుతుంది. 

 

అందుకే.. తనకి బాగా సన్నిహితులైన నటీనటుల ద్వారా రాయబారాలు మొదలుపెట్టిందట. ఎలాగో.. వెంకటేష్- నాగ చైతన్యల 'వెంకీ మామ' సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఇక ఇప్పుడు, బాలకృష్ణ తాజా చిత్రంలో కథానాయిక పాత్ర కోసం బోయపాటితో చర్చలు జరుపుతోందట. పారితోషికం కూడా తగ్గిస్తానని సూచనలు అందిస్తుందట. ఇదిలాఉంటే.. ఇటీవలే ఈ భామ లండన్ హోటల్ లో దారుణంగా మోసపోయిందట. ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని సంభాషించింది. 

 

కొన్ని రోజుల క్రితం స్నేహితులతో లండన్ వెళ్లిన రకుల్ ఓ ఫేమస్ హోటల్లో డిన్నర్ పార్టీ ఏర్పాటుచేసింది. పార్టీ పూర్తయిన తరువాత ఆ స్టార్ హోటల్ వాళ్ళు వేసిన బిల్ చూసి రకుల్ బిత్తరపోయిందట. బిల్ ఎంతో తెలుసా.. అక్షరాలా పది లక్షల రూపాయిలు. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించి 'ఎవరైనా లండన్ వెళితే ఆ హోటల్ కి మాత్రం వెళ్లొద్దు' అని హెచ్చరించిందట. అది చూసిన కొంతమంది నెటిజన్స్ కోట్లు కోట్లు రెమ్యూనరేషన్ తీస్కుంటున్నపుడు ఫ్రెండ్స్ కి ఆ మాత్రం పార్టీ ఇవ్వలేవా? అంటూ ట్రోలింగ్ కూడా చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS