అఖిల్‌కి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పిన రామ్‌చరణ్‌.!

మరిన్ని వార్తలు

ఈ నెల 25న అఖిల్‌ తాజా చిత్రం 'మిస్టర్‌ మజ్ను' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, అఖిల్‌కి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు. అభిమానుల మధ్యనే గొడవలు కానీ, హీరోల మధ్య ఐకమత్యం ఈ రేంజ్‌లోనే ఉంటోంది. ఒకరి సినిమాను మరొకరు అభినందించుకుంటున్నారు. శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఒకరి సినిమా ఫంక్షన్స్‌కి మరొకరు హాజరవుతున్నారు. ఇదంతా చూస్తున్నా కానీ, హీరోల విషయంలో అభిమానుల వైఖరి మాత్రం మారడం లేదు. 

 

అఖిల్‌, చరణ్‌ మంచి ఫ్రెండ్స్‌. కలిసి వెకేషన్స్‌ ఎంజాయ్‌ చేస్తుంటారు. ఎప్పటికప్పుడే పార్టీలు సెలబ్రేట్‌ చేసుకుంటుంటారు. ఇదిగో తాజాగా అఖిల్‌ సినిమా సక్సెస్‌ అవ్వాలని సోషల్‌ మీడియా వేదికగా అఖిల్‌కి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు రామ్‌చరణ్‌. అఖిల్‌ నటిస్తున్న మూడో చిత్రమిది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించింది. తమన్‌ మ్యూజిక్‌ అందించిన ఈ సినిమాని బివిఎస్ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS