ఎన్టీఆర్ లో ఇద్దరు ప్రముఖ రైటర్లు

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్ బయోపిక్ గురించిన ఏ వార్త బయటికోచ్చినా అది సంచలనంగానే మారుతున్నాయి. అందులో ముఖ్యంగా ఈ బయోపిక్ లో నటిస్తున్న సెలబ్రిటీల గురించిన వార్తలకి పెద్ద ఎత్తున మైలేజ్ వస్తున్నది.

తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ లో పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి & మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ ప్రముఖుల పాత్రలని పోషించనున్నారు. వీరికి సంబందించిన షూటింగ్ జరుగుతున్నదట. ఇక రామజోగయ్య శాస్త్రి మనకి ఈ చిత్రంలో లెజెండరీ పాటల రచయిత అయిన సినారె పాత్రలో కనిపిస్తుండగా ఎన్టీఆర్ పర్సనల్ మేకప్ మ్యాన్ గా ఉండిన పీతాంబరం పాత్రలో మాటల రచయిత అయిన సాయి మాధవ్ మెరవనున్నారు.

ఇప్పటికే ఈ చిత్రంలో అనేకమంది సెలబ్రిటీలు ఎన్టీఆర్ తో సమకాలికుల పాత్రలలో కనిపిస్తుండడంతో సగటు సినీ అభిమానులకి ఈ చిత్రం పైన అమితాసక్తి పెంచుతున్నది.

బయోపిక్ లలో భాగంగా మొదటి పార్ట్ జనవరి 9న విడుదలవుతుండగా రెండవ పార్ట్ జనవరి 24న ప్రేక్షకుల ముందుకిరానుంది.  

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS