నాగార్జున-టబుల జంట వెండితెర పైన హిట్ పెయిర్ గా పేరుపొందింది. వీరు కలిసి నటించిన సినిమాలు కూడా విజయవంతం అవ్వడం కూడా వీరికి ఈ హిట్ ట్యాగ్ వచ్చేలా చేసింది.
ఇదిలావుండగా నాగార్జున-ఆర్జీవీ తాజా చిత్రంలో టబు మెయిన్ లీడ్ చేస్తున్నది అని వస్తున్న వార్తల పైన దర్శకుడు ఆర్జీవీ స్పందించాడు. హీరోయిన్ టబు అలాగే లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ తన చిత్రంలో నటించట్లేదు అని క్లారిటీ ఇచ్చేశాడు.
దీనితో చాల కాలం తరువాత మళ్ళీ ఈ హిట్ పెయిర్ ని చూడనున్నాము అని అనుకున్న ప్రేక్షకులకి ఇది ఒకరకంగా చేదు వార్తే అని చెప్పుకోవచ్చు.
ఇక ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది, వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది.