రోజా Vs ప‌వ‌న్‌.. వార్ మ‌ళ్లీ మొద‌లైంది

మరిన్ని వార్తలు

మెగా కుటుంబంపై సెటైర్లు వేయ‌డం రోజాకి అల‌వాటైన ప‌నే. రాజ‌కీయాల్లో దిగిన‌ప్ప‌టి నుంచీ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూనే ఉంది. మూడు పెళ్లిళ్ల వ్య‌వ‌హారంలో ప‌వ‌న్ ని టార్గెట్ చేసి రెచ్చిపోయింది రోజా. ఈ విష‌యంలో పెద్ద ర‌భ‌సే జ‌రిగింది. వీలున్న‌ప్పుడ‌ల్లా ప‌వ‌న్ పై ఏదోలా సెటైర్లు వేస్తూనే ఉంది. తాజాగా ప‌వ‌న్‌పై మ‌రోసారి విరుచుకుప‌డింది ఈ న‌గ‌రి ఎం.ఎల్‌.ఏ


మూడు రాజ‌ధానుల వ్య‌వ‌హారాన్ని ప‌వ‌న్ ముందు నుంచీ వ్య‌తిరేకిస్తూనే ఉన్నాడు. రాజ‌ధాని మార్పు విష‌యంలో.. త‌న అభ్యంత‌రాల్ని చాలాసార్లు వ్య‌క్తం చేశాడు. తాజాగా.. రాజ‌ధానుల విష‌యంలో ప‌వ‌న్ కామెంట్లు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. దీనిపై రోజా స్పందించింది. గాజువాక‌లో త‌న‌ని ఓడించారు కాబ‌ట్టే, విశాఖకి రాజ‌ధాని త‌ర‌లిరావ‌డం ప‌వ‌న్‌కి ఇష్టం లేద‌ని సెటైర్ వేసింది. దీనిపై ప‌వ‌న్ అభిమానులు మండిప‌డుతున్నారు. గాజువాక‌లో ప‌వ‌న్ ఓడిపోవ‌డాకీ?  రాజ‌ధాని విష‌యంలో ప‌వ‌న్ అభ్యంత‌రం చెప్ప‌డానికీ సంబంధం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. రోజా ఇలా సంచుకిత మ‌న‌సుతో ఆలోచిస్తూ, ప్రాంతాల మ‌ధ్య విబేదాలు సృష్టించ‌డం స‌రికాదంటూ... హిత‌వు చెబుతున్నారు. తాజా కామెంట్ల‌తో ప‌వ‌న్ అభిమానుల్ని రోజా మ‌రోసారి కెలికిన‌ట్టైంది. మ‌రోసారి రోజా కీ, ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి మ‌ధ్య వార్ మొద‌లైపోయింది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS