తేజు ఇంత పెద్ద షాకిచ్చాడేంటీ..!

మరిన్ని వార్తలు

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ తల్లి విడాకుల విషయం తాజాగా బయటికి వచ్చింది. ఇంతవరకూ ఈ విషయం ఇండస్ట్రీలో చాలా కొద్ది మందికి తప్ప పెద్దగా ఎవ్వరికీ తెలియదు. కానీ 'చిత్రలహరి' ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సాయి ధరమ్‌ తేజ్‌ ఈ విషయంపై స్పందించాల్సి వచ్చింది. నిజానికి సాయి ధరమ్‌ తేజ్‌ టెన్త్‌ క్లాస్‌లో ఉన్నప్పుడు ఆయన తల్లితండ్రులు విడాకులు తీసుకున్నారట. ఆ విషయం పైనే తేజ్‌ స్పందిస్తూ, 'అది జరిగి ఇప్పటికి 15 ఏళ్లు గడిచిపోయింది. ఇప్పుడంటే నేను, తమ్ముడు అమ్మతో ఉన్నాం.

 

కానీ ఆ తర్వాత మేమిద్దరం పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోతే అమ్మ ఒంటరిగా ఫీలవ్వకూడదు కదా. అందుకే మా ఇద్దరి ఇష్టంతోనే అమ్మ రెండో పెళ్లి చేసుకున్నారు. ఆయనతో అమ్మ చాలా సంతోషంగా ఉంది. మా రిలేషన్‌షిప్‌ కూడా బాగానే ఉంది. కొన్ని కారణాలతో అమ్మ, నాన్నలు కలిసి ఉండడం కుదరలేదు. కలిసి ఉండడం కుదరనప్పుడు విడిపోవడమే మంచిదని నేను భావిస్తాను. అదే వారి నిర్ణయం కూడా. వారి నిర్ణయాన్ని నేను, తమ్ముడు స్వాగతించాం. విడిపోయినా నాన్నతో మాకు ఇప్పటికీ మంచి రిలేషన్‌షిప్‌ కంటిన్యూ అవుతోంది.. 'అని తేజు చెప్పాడు. 

 

తల్లి తండ్రుల విషయంలో అంత పెద్ద మనసులో ఆలోచించిన తేజు ఈజ్‌ గ్రేట్‌. ఇకపోతే లేటెస్ట్‌గా తేజు నటించిన 'చిత్రలహరి' మంచి విజయం అందుకుంది. విమర్శకుల ప్రశంసలతో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ మధ్య వరుస పరాజయాల తర్వాత తేజు 'చిత్రలహరి'తో ఊపిరి పీల్చుకున్నాడు. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన 'చిత్రలహరి'లో నివేదా పేతురాజ్‌, కళ్యాణీ ప్రియదర్శిని హీరోయిన్లుగా నటించారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS