రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసిన సాయి పల్లవి..

మరిన్ని వార్తలు

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం 'ఫిదా'. ఈ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచమైన మలయాళీ భామ 'సాయి పల్లవి'. తొలి సినిమాతోనే తన నటనా శైలితో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా నటించిన చిత్రం 'పడి పడి లేచే మనసు'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శర్వానంద్ హీరోగా నటించాడు. అయితే.. ఈ సినిమా అనుకున్న విజయాన్ని సాధించకపొవడంతో నిర్మాతలకు ఆశించిన లాభాలు దక్కలేదు.

 

దాంతో.. సాయి పల్లవి ఈ సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ ని నిర్మాతలకు తిరిగి ఇచ్చేసిందట. ఇండస్ట్రీ లో టాప్ హీరోలు తమ సినిమాలు అనుకున్నంతగా ఆడనప్పుడు ఇలా తమ పారితోషికాన్ని తిరిగి ఇచ్చేయటం సాధారణంగా మనం చూస్తుంటాము. కానీ.. ఒక హీరోయిన్ ఇలా ప్రొడ్యూసర్స్ గురించి అలోచించి తన పారితోషికాన్ని తిరిగివ్వటం తెలుగు సినీ పరిశ్రమలోనే మొదటి సారి చూస్తున్నాము. దీంతో.. సాయి పల్లవి రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా తన మంచితనాన్ని చాటుకుంది.

 

ఈ సినిమా లో నటన పరంగా శర్వానంద్ కి, సాయి పల్లవికి మంచి మార్కులే పడ్డా.. ఎందుకో సినిమా ప్రేక్షకులకు అంతగా ఆకట్టుకోలేదు. ఇదిలాఉండగా, సాయి పల్లవి ధనుష్ సరసన నటించిన మరో చిత్రం 'మారి 2' మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం తమిళంలో సూర్య సరసన 'ఎన్ జి కె' లో హీరోయిన్ గా నటిస్తుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS