మీడియా వర్గాలపై గుస్సా అయిన మలర్‌ బ్యూటీ.!

మరిన్ని వార్తలు

మలర్‌ బ్యూటీ సాయిపల్లవికి సంచలనాలతో పాటు, వదంతులు కూడా ఎక్కువే. తొలి సినిమా 'ఫిదా'తో సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టి, మోస్ట్‌ టాలెంటెడ్‌ యాక్ట్రెస్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకున్న సాయిపల్లవి ఆ తర్వాత నుండీ సక్సెస్‌లతో పోటీ పడి, గాసిప్స్‌ని కూడా వెంట తెచ్చుకుంది. సాయి పల్లవితో హీరోలకు, నిర్మాతలకు తంటా అని ఆమెపై విమర్శలున్నాయి. ఏకంగా యంగ్‌ హీరో నాగశౌర్య అయితే ఓపెన్‌గానే నోరు పారేసుకున్నాడు సాయిపల్లవిపై. ఇదంతా గతం. 

 

అసలు వివరాల్లోకి వెళితే, ఈ డేరింగ్‌ లేడీపై ఈ మధ్య ప్రేమ వదంతులు ఎక్కువైపోయాయి. ఎంత పట్టించుకోకుండా ఉండాలన్నా, అవి చిలికి చిలికి గాలివానగా మారి సాయిపల్లవిని ఇబ్బందులకు గురి చేస్తుండడంతో, ఎట్టకేలకు సాయి పల్లవి స్పందించాల్సి వచ్చింది. తమిళంలో డైరెక్టర్‌గా ఫుల్‌ బిజీగా ఉన్న ఎ.ఎల్‌.విజయ్‌తో సాయిపల్లవి ప్రేమాయణం సాగిస్తోందనీ, చాలా కాలంగా ఆయనతో డేటింగ్‌లో ఉందనీ వస్తున్న రూమర్స్‌లో నిజం లేదనీ, విజయ్‌ తనకు మంచి స్నేహితుడు మాత్రమే అని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. 

 

మీడియా వర్గాల్లో సర్క్యులేట్‌ అవుతోన్న ఈ న్యూస్‌ ఇంతటితో ఆపకపోతే, పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించింది. డైరెక్టర్‌ ఎ.ఎల్‌.విజయ్‌ కూడా ఈ గాసిప్స్‌కి ఇదే వెర్షన్‌లో స్పందించారు. హీరోయిన్‌ అమలాపాల్‌ మాజీ భర్తే ఈ విజయ్‌. సాయిపల్లవితో 'కణం' సినిమా రూపొందించారు. తాజాగా కంగనాతో 'తలైవి' తెరకెక్కిస్తున్నారు. కాగా, సాయి పల్లవి ప్రస్తుతం రానా సినిమాలో నటిస్తోంది. వేణు ఉడుగుల ఈ సినిమాకి దర్శకుడు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS