సాక్షి శివానంద్ పై తీవ్ర ఆరోపణలు చేసిన చెల్లెలు శిల్ప..!

మరిన్ని వార్తలు

బావగారు బాగున్నారా, యువరాజు వంటి చిత్రాల్లో నటించిన సాక్షి శివానంద్ గుర్తుందిగా.. ఇప్పుడు ఇండస్ట్రీ కి దూరమైనా ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలుగొందింది. ఆ సమయం లోనే తన చెల్లి శిల్పా శివానంద్ ను మంచు విష్ణు హీరోగా నటించిన 'విష్ణు' చిత్రం ద్వారా తెలుగుకి పరిచయం చేసింది. కానీ శిల్ప ఇప్పుడు బాలీవుడ్ బుల్లి తెరలో సెటిల్ అయింది. ఇప్పుడు సొంత అక్కే నన్ను చంపాలని చూస్తోంది అని శిల్ప సోషల్ మీడియా లో మొర పెట్టుకోవడానికి కారణం ఏంటి అనేది హాట్ టాపిక్ గా మారింది. అసలు వీరి మధ్య చంపునేంత కలహం ఏమయ్యుంటుంది అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.

 

ఒహన్న శివానంద్ గా పేరు మార్చుకున్న శిల్ప, జూలై 18న తన పేస్ బుక్ పోస్ట్ ద్వారా అనుమానాస్పద విషయాలను వెల్లడించింది. తన అత్త భావన భ్రంబర్ట్ గతం లో ఇన్సూరెన్స్ కోసం భర్తని చంపిందని ఇప్పుడు మళ్ళీ అదే ఇన్సూరెన్స్ కోసం సాక్షి తో చేరి తనను కూడా చంపాలని చూస్తుందని, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అమెరికాకు పరారీ అయిందని వాపోయింది. దీనిపై పూర్తి వివరాలు త్వరలోనే మీడియా కు వివరిస్తానని, ఈ సమయంలో తన అభిమానులు, శ్రేయోభిలాషులు తనకు అండగా ఉండాలని కోరుతుంది శిల్ప.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS