రావాలని ఉన్నా రాలేకపోతున్నానంటోన్న శామ్‌

మరిన్ని వార్తలు

మార్చి 30న ప్రేక్షకుల ముందుకొచ్చిన 'రంగస్థలం' సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొడుతోన్న సంగతి తెలిసిందే. అంచనాలకు మించి ఘన విజయం అందుకుందీ సినిమా. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ అభిమానులకు థాంక్స్‌ మీట్‌ని ఏర్పాటు చేసింది.

 

ఈ మీటింగ్‌కి చిత్ర యూనిట్‌ అంతా హాజరవుతోంది. కానీ 'రంగస్థలం' రాణి సమంత హాజరు కావట్లేదు. ఎందుకంటే, సమంత ప్రస్తుతం తన భర్త చైతూతో విహార యాత్రలో ఉంది. ఓ పక్క 'రంగస్థలం', మరో పక్క 'మహానటి' ఇతర చిత్రాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్న శామ్‌ ఇప్పుడే కాస్త రిలాక్స్‌ అయ్యింది. చైతూ కూడా తాను చేస్తోన్న సినిమాల నుండి కాస్త విరామం తీసుకున్నాడు. దాంతో ఈ ప్రేమ జంట సరదాగా విహార యాత్రలు ప్లాన్‌ చేసుకున్నారు. ఆ నేపథ్యంలో ప్రస్తుతం సమంత, చైతూ అమెరికాలోని పలు ప్రసిద్ధ ప్రదేశాలను సందర్శిస్తున్నారు. ఎప్పటికప్పుడే వాటికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ సమంత అభిమానులను ఖుషీ చేస్తోంది. 

మరోపక్క 'రంగస్థలం' ఇచ్చిన సక్సెస్‌ కిక్‌కి సమంత ఆనందం అంతా ఇంతా కాదు. అయితే ప్రస్తుతం చిత్ర యూనిట్‌ నిర్వహించిన సక్సెస్‌ మీట్‌కి సమంత హాజరు కాలేకపోతున్నందుకు చాలా ఫీల్‌ అవుతోందట. అభిమానులకు థాంక్స్‌ చెప్పేందుకు ఏర్పాటు చేసిన ఈ సక్సెస్‌ మీట్‌లో తాను భాగం కాలేకపోతున్నందుకు ఫీల్‌ అవుతూ, తన ఫీలింగ్‌ని సోషల్‌ మీడియా ద్వారా ఎక్స్‌ప్రెస్‌ చేసింది. 

ఈ చిత్రంలో నటించినందుకు చాలా గర్వపడుతున్నాననీ, ఇంత గొప్ప సక్సెస్‌ అందించినందుకు ఫ్యాన్స్‌కి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపింది సమంత.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS