అర్జున్ రెడ్డితో తొలి సినిమాతోనే తన స్టామినా చూపించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాతో బాలీవుడ్లోనూ.. హిట్టు కొట్టారు. తన కెరీర్ జెట్ వేగంలో దూసుకువెళ్లిపోతున్న ఈ దర్శకుడి ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. సందీప్ రెడ్డి మాతృమూర్తి సుజాత రెడ్డి ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. వరంగల్ వెంకటయ్య కాలనీలో నివసిస్తున్న ఆమె ఈ రోజు తెల్లవారుఝామున తుది శ్వాస విడిచారు.
గత కొంతకాలంగా సుజాత రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అర్జున్ రెడ్డిని బాలీవుడ్లో కబీర్ సింగ్ గా తీసి, 200 కోట్ల సినిమాగా నిలబెట్టారు సందీప్. ఇప్పుడు బాలీవుడ్ ఆయనకు మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. తదుపరి సినిమా ఎలా చేయాలా? అని ఆలోచనల్లో ఉన్న సందీప్కి ఇది అనుకోని షాక్. ఈ విషాదం నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని, సుజాత రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.