'సరిలేరు..' తాజా అప్‌డేట్‌ ఇదే.!

మరిన్ని వార్తలు

మహేష్‌ బాబు తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరూ..' చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమాకి సంబంధించి ఓ తాజా అప్‌డేట్‌ హల్‌చల్‌ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్‌లుక్‌, ట్రైలర్‌తో కూడిన టీజర్‌ విడుదలయ్యి, మంచి రెస్పాన్స్‌ అందుకున్నాయి. ఇంకా చాలా సర్‌ప్రైజ్‌లు ఫ్యాన్స్‌ కోసం సిద్ధంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే, తాజాగా చిత్ర దర్శకుడు అనిల్‌ రావిపూడి ఫ్రెష్‌ అప్‌డేట్‌ ఇస్తూ, ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు.

 

'సరిలేరు.. విలన్‌ హౌస్‌ షెడ్యూల్‌ పూర్తి..' అంటూ పోస్టర్‌ ద్వారా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారాయన. ఇంతకీ అనిల్‌ ఇవ్వబోతున్న ఆ అప్‌డేట్‌ ఏంటంటే, దీపావళికి 'సరిలేరు..' నుండి ఓ సర్‌ప్రైజ్‌ రానుందట. ఆ సర్‌ప్రైజ్‌ ట్రీట్‌కి రెడీగా ఉండండి అంటూ ఊరిస్తూ అనిల్‌ రావిపూడి సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌కి నెటిజన్స్‌ నుండి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. రష్మికా మండన్నా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సీనియర్‌ నటి విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు.

 

దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే, జనవరి 12 అని ప్రకటించిన విడుదల తేదీలో చిన్నా, చితకా మార్పులు జరిగే అవకాశముందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే రోజు బన్నీ 'అల వైకుంఠపురములో' విడుదల కానున్న కారణంగా మహేష్‌ సినిమా రిలీజ్‌ డేట్‌ని ఛేంజ్‌ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బహుశా మహేష్‌ ఒకరోజు ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే జనవరి 11న అని తెలుస్తోంది. చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS