తన గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్న శర్వానంద్..!

మరిన్ని వార్తలు

విభిన్న పాత్రల్లో తన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శర్వానంద్ తాజా చిత్రం 'పడి పడి లేచే మనసు'. 'లై' తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ శిల్పకళా వేదిక లో జరిగింది.  ఫిదా బ్యూటీ సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మధ్య కొన్ని చిత్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి హాజరవుతూ గోల్డెన్ హ్యాండ్ టాగ్ ని సొంతం చేసుకుంటున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరయిన విషయం తెలిసిందే.

 

ప్రీ రిలీజ్ ఫంక్షన్లో శర్వానంద్ సాయి పల్లవి గురించి మాట్లాడుతూ 'ఈ అమ్మాయి గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా మంది ఈ అమ్మాయి గురించి చాలా వినుంటారు. కానీ అదంతా సోదే' అంటూ గతంలో సాయి పల్లవి మీద వచ్చిన నెగటివ్ కామెంట్స్ అన్నిటికి ఒక స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. అంతకంటే మంచి నటి, కోఆర్టిస్ట్ మరియు ఒక మంచి ఫ్రెండ్ ని నాకు 'పడి పడి లేచే మనసు' ఇచ్చింది అని అన్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో  నిర్మితమైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 21న  విడుదల కానుంది.

 

మరోవైపు సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వా నటిస్తున్న చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమా 2019 సమ్మర్ లో రిలీజ్ అవుతుందని సమాచారం. ఇదిలా ఉండగా తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ '96' తెలుగు రీమేక్ లో శర్వానంద్ నటించబోతున్నట్లు తాజా సమాచారం. కానీ  ఈ విషయంపై శర్వా ఇంకా అధికారికంగా స్పందించలేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS