DSP నాకు అన్యాయం చేశాడు!

మరిన్ని వార్తలు

రామ్ చరణ్ రంగస్థలం చిత్రం ప్రేక్షకులని ఎంతగా ఆకట్టుకుందో అంతే స్థాయిలో రంగస్థలం పాటలు కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలో అలరిస్తున్నాయి. ముఖ్యంగా అందులో శివ నాగులు పాడిన ఆ గట్టునుంటావా నాగన్న.. ఈ గట్టుకోస్తావా.. పాట ఇప్పుడు హిట్ సాంగ్ అయి కూర్చుంది.

ఆ పాటలోని సాహిత్యానికి శివ నాగులు గొంతు తోడవ్వడం ఒక పెద్ద మ్యాజిక్ చేసింది అనే చెప్పాలి. ఆల్బం లో కూడా అందరి నుండి హిట్ టాక్ అందుకున్న పాట ఇది. ఇవ్వన్ని పక్కనపెడితే, ఈ సినిమా విడుదలయ్యాక, ఈ చిత్రంలో శివ నాగులు గొంతు కాకుండా దేవిశ్రీప్రసాద్ గొంతు వినపడింది.

దీనితో శివ నాగులు తో సహా ప్రేక్షకులు మొత్తం నిరాశ చెందారు. ఇదే అంశం పైన సుకుమార్ స్పందించి- హీరోకి దేవిశ్రీప్రసాద్ గొంతు ఎక్కువగా సరిపోవడంతో ఆయన గొంతు పెట్టడం జరిగింది అని తెలిపాడు. ఇక ఇదే అంశం పైన శివ నాగులు మాట్లాడుతూ- ఇలా జరిగింది అన్న విషయం కనీసం నాకు విడుదలకి ముందే చెప్పినా కూడా తాను ఇంతలా బాధపడకుండా ఉండేవాడిని అని.. నా పాట ఉందని తెలిసి నా స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు ఇలా జరిగేసరికి అందరూ ఏమైంది అని అడగడం నాకు బాధని పెంచుతున్నది అని ఆయన బాధని, నిరాశని వెలిబుచ్చాడు.

ఏదేమైనా ఇలా జరగకుండా ఉండాల్సింది అని అందరు అభిప్రాయపడుతున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS